బీజేపీలో చేరనున్న హరీష్ రావు : ఆంగ్ల పత్రిక కథనం

సోమవారం, 1 ఏప్రియల్ 2019 (11:59 IST)
తెరాస సీనియర్ నేతల్లో ఒకరు, మాజీ మంత్రి టి.హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం అటు తెరాస పార్టీలోనే కాకుండా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. 
 
ఇప్పటికే రాజకీయంగా హరీశ్ రావు ఊగిసలాటలో ఉన్నారని విశ్లేషకులు భావిస్తున్న తరుణంలో ఈ వార్తను ఆ పత్రిక ప్రచురించింది. చివరిలో "ఇది ఏప్రిల్ ఫూల్ డే అని పాఠ‌కులు గుర్తుంచుకోవాలి" అన్న వాక్యాన్ని చూసేంత వరకూ ఈ వార్తను నిజమని నమ్మి ఆతృతగా లక్షలమాది మంది పాఠకులు చదివారు. 
 
వాస్తవానికి ఓ పదేళ్ల క్రితం వరకూ ఏప్రిల్ 1న ఈ తరహా వార్తలను అన్ని దినపత్రికలూ ప్రచురించి, చివరిలో ఇది 'ఫూల్స్ డే' అని గుర్తు చేస్తుండేవి. కాలానుగుణంగా ఆ సంప్రదాయం తొలగిపోయింది. అటువంటి సమయంలో హరీశ్ రావుపై బ్యానర్ కథనంగా 'ఫూల్స్ డే స్టోరీ'ని ప్రచురించడం చర్చనీయాంశమైంది.

అన్నీ చూడండి

ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా కాగితం పడవలు రిలీజ్

Jana Nayagan: సీఎం విజయ్ చివరి సినిమా : జన నాయగన్ రిలీజ్‌కు రంగం సిద్ధం?

Rajinikanth :రజనీకాంత్ జైలర్ 2 నుంచి తాజా అప్ డేట్ ప్రకటించిన సన్ పిక్చర్స్

Akhil: అఖిల్ అక్కినేని రగ్గడ్ లెనిన్ ట్రైలర్ 10 మిలియన్ల దాటి ఉత్సాహానిచ్చింది

రజనీకాంత్ 'జైలర్ 2' చిత్రీకరణ పూర్తి

తర్వాతి కథనం
Show comments