కొలిక్కివచ్చిన హేమంత్ హత్య కేసు.. ఇక ఫాస్ట్ కోర్టులో విచారణ!!

బుధవారం, 14 అక్టోబరు 2020 (09:26 IST)
ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన హేమంత్ హత్య కేసు వ్యవహారం ఓ కొలిక్కివచ్చింది. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టారు. ఇందులో మొత్తం 18 మంది నిందితులను విడతలవారీగా కష్టడీలోకి తీసుకుని విచారించారు. వీరు వెల్లడించిన విషయాలతో పాటు పోలీసులు కూడా కీలకమైన ఆధారాలు సేకరించారు. దీంతో ఈ కేసులో నిందితుల వద్ద పోలీసుల విచారణ పూర్తయింది. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సాగనుంది. అలాగే, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసులో చార్జిషీటును కూడా పక్షం రోజుల లోపు దాఖలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 
 
కాగా, ఇంటీరియల్ డిజైనర్‌గా పని చేస్తూ వచ్చిన హేమంత్‌ అనే యువకుడు రెడ్డి కులానికి చెందిన అవంతి రెడ్డిని ప్రేమించాడు. ఈ పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి ప్రేమించిన యువతిని హేమంత్ ప్రేమపెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని అవంతి తల్లిదండ్రులు, బంధువులు, కిరాయి హంతకులతో హత్య చేయించారు. ఈ కేసులోని నిందితుల్లో అవంతి తల్లిదండ్రులు, మేనమాన కీలక సూత్రధారులుగా ఉన్నారు. 

అన్నీ చూడండి

సినిమా బండి త‌ర్వాత నటుడిగా కెరీర్ పూర్తిగా మారింది: రాగ్ మ‌యూర్‌

Jonnavithula: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో వస్తున్న మూవీ లలిత

Mega158: మెగా158 కోసం జిమ్ వర్కౌట్‌ను పంచుకున్న చిరంజీవి

Manchu Manoj: డేవిడ్ రెడ్డి టీజర్ తో రా కింగ్ ట్యాగ్ తో వస్తున్న మంచు మనోజ్

క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల రిలేషన్... సోషల్ మీడియాలో పుకార్లు

తర్వాతి కథనం
Show comments