కొలిక్కివచ్చిన హేమంత్ హత్య కేసు.. ఇక ఫాస్ట్ కోర్టులో విచారణ!!

Written By ఠాగూర్
Updated: బుధవారం, 14 అక్టోబరు 2020 (09:27 IST)
ఇటీవల హైదరాబాద్ నగరంలో జరిగిన హేమంత్ హత్య కేసు వ్యవహారం ఓ కొలిక్కివచ్చింది. ఈ కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టారు. ఇందులో మొత్తం 18 మంది నిందితులను విడతలవారీగా కష్టడీలోకి తీసుకుని విచారించారు. వీరు వెల్లడించిన విషయాలతో పాటు పోలీసులు కూడా కీలకమైన ఆధారాలు సేకరించారు. దీంతో ఈ కేసులో నిందితుల వద్ద పోలీసుల విచారణ పూర్తయింది. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సాగనుంది. అలాగే, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ కేసులో చార్జిషీటును కూడా పక్షం రోజుల లోపు దాఖలు చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 
 
కాగా, ఇంటీరియల్ డిజైనర్‌గా పని చేస్తూ వచ్చిన హేమంత్‌ అనే యువకుడు రెడ్డి కులానికి చెందిన అవంతి రెడ్డిని ప్రేమించాడు. ఈ పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి ప్రేమించిన యువతిని హేమంత్ ప్రేమపెళ్లి చేసుకున్నాడు. దీన్ని జీర్ణించుకోలేని అవంతి తల్లిదండ్రులు, బంధువులు, కిరాయి హంతకులతో హత్య చేయించారు. ఈ కేసులోని నిందితుల్లో అవంతి తల్లిదండ్రులు, మేనమాన కీలక సూత్రధారులుగా ఉన్నారు. 

అన్నీ చూడండి

అమీర్ లోగ్ చూస్తే హైదరాబాదీల మీద గౌరవం పెరుగుతుంది : దర్శకుడు రమణా రెడ్డి

స్క్రిప్ట్ విన్నప్పుడు సందేహం ఉండేది, ఇప్పటి ఆదరణకు ఆనందగా వుంది : కిరణ్ అబ్బవరం

Jai Krishna: కొన్ని చోట్ల అలా అనిపించొచ్చు, వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలి ఉంది : జై కృష్ణ ఘట్టమనేని

Rohit Nara : వినికిడి లోపం గల సౌండ్ ఇంజినీర్ గా రోహిత్ నారా టైటిల్ ప్రకటన

Surya and Mamitha Baiju : ది వెడ్డింగ్ సాంగ్ లో ఆడి పాడిన సూర్య, మమితా బైజు

తర్వాతి కథనం
Show comments