Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ చిరుత పట్టుబడింది

Written By ఎం
Updated: ఆదివారం, 11 అక్టోబరు 2020 (18:26 IST)
హైద‌రాబాద్‌ శివారులో కొన్ని నెలలుగా ఓ చిరుత అలజడి రేపుతోన్న విషయం తెలిసిందే. మొన్న అర్ధరాత్రి రాజేంద్ర‌న‌గ‌ర్ వాలంత‌రి రైస్ రిసెర్చ్ సెంట‌ర్ స‌మీపంలోనూ చిరుత రెండు లేగ దూడ‌ల‌ను చంపడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 
 
ఈ విషయంపై స్థానికులు పోలీసులు, అట‌వీశాఖ సిబ్బందికి స‌మాచారం అందించడంతో ఆ చిరుత కోసం వెతికారు. చిరుత తిరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, చనిపోయిన దూడలను ఎరగా అక్కడ ఉంచారు. 
 
దీంతో గత అర్ధరాత్రి ఆ చిరుత పశువుల పాక వద్దకు వచ్చి అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. ఎట్టకేలకు చిరుత చిక్కడంతో తమకు ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.  చిరుత పట్టుకున్న అనంతరం అటవీశాఖ అధికారులు దాన్ని జూపార్కుకు తీసుకెళ్లారు.

అన్నీ చూడండి

Senior Naresh: 55 ఏళ్ల సినీ జర్నీ చేస్తున్న డా. నరేష్ విజయకృష్ణకు గోవా గవర్నర్ ఘన సత్కారం

Kamal Haasan: రశ్మికను చూస్తే అసూయ లేదు. గడ్డం తీసినా నేను పాత్రలో మెప్పించలేను : కమల్ హాసన్

Pa Ranjith: విభిన్న కాలమానాలతో పా రంజిత్ చిత్రం వరల్డ్ ఆఫ్ వెట్టువం

Disco Santhi: ఆసుపత్రి నుంచి శాంతి శ్రీహరి డిచ్చార్జ్ - మేఘాంశ్ సినిమా ఆస్మాన్ ను హిట్ చేయండి

Samantha: సమంత రూత్ ప్రభు సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ న్యాయనిర్ణేతగా ఆస్ట్రేలియా చెఫ్ శశి చెలియా

తర్వాతి కథనం
Show comments