విద్యార్థిని ప్రాణం తీసిన ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు

శుక్రవారం, 17 డిశెంబరు 2021 (13:59 IST)
తెలంగాణాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలు గురువారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఫలితాల్లో కేవలం 49 శాతంమంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలపై పైచేయిగా నిలిచింది. 
 
అయితే, ఈ ఫలితాలను చూసిన తర్వాత అనేక మంది విద్యార్థులు తీవ్ర షాక్‌కు గురయ్యారు. ఏం రాసినా పాస్ చేస్తామని ప్రకటించిన ఇంటర్ బోర్డు.. అనేక మంది విద్యార్థులను ఫెయిల్ చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తన్నారు. 
 
ఓ విద్యార్థి అయితే, ఏకంగా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్‌లను ట్యాగ్‌ చేస్తూ ఆత్మహత్య చేసుకోనున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత ఆ విద్యార్థి తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. 
 
ఇదిలావుంటే నల్గొండ రైల్వే స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక గాంధీ నగర్‌ కాలనీకి చెందిన విద్యార్థిని జాహ్నవి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విద్యార్థినికి ఇంటర్‌లో తక్కువగా మార్కులు వచ్చాయన్న మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

అన్నీ చూడండి

Bramhi: కామెడీ, మిస్టరీ అంశాల‌తో మేము‘కాప్’లం ట్రైల‌ర్‌ కు బ్రహ్మానందం కితాబు

Kiran: తిమ్మరాజుపల్లి టీవీ చిత్రం నిర్మాతగా నాకెంతో సంతృప్తినిచ్చింది - కిరణ్ అబ్బవరం

Durgesh: ఆంధ్ర సినీ రాజధానిగా తిరుపతి - కందుల దుర్గేష్‌ ని కలిసిన పారడాక్స్ పిక్చర్స్ అధినేతలు

ఐదు సూత్రాల చుట్టూ తిరిగే జీవితనేపథ్యంగా ఏదైనా సాధ్యమే మూవీ

'జన నాయగన్' నిర్మాతకు తమిళనాడు సీఎం విజయ్ నుంచి పిలుపు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments