జయలలితకు ఫోన్చేసి అభినందనలు తెలిపిన కేసీఆర్
తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్న అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి జయలలితకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. అన్నా డీఎంకే శాసనసభాపక్ష నాయకురాలిగా మరోసారి పార్టీ ఎమ్మెల్యేలు జయను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ శుక్రవారం ఉదయం జయలలితకు ఫోన్చేసి శుభాకాంక్షలు చెప్పారు.
అక్రమాస్తుల కేసులో జయ నిర్దోషి పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆమో మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ స్థితిలో శుక్రవారం ఉదయం ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్ రోశయ్యకు అందజేశారు. ఈ నేపథ్యంలో శనివారం జయలలిత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.