ముగ్గురిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడు... ఎందుకు?

సోమవారం, 14 అక్టోబరు 2019 (07:29 IST)
అన్నను, అన్న కూతురిని, తన సొంత కూతురిని చంపాడు. ఆపై తాను గొంతు కోసుకున్నాడు. అనంతరం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లాలో ముగ్గురు కుటుంబ సభ్యులను హత్య చేసిన నిందితుడు.. ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిన్న దోమకొండ సమీపంలోని అటవీ ప్రాంతంలో భిక్కనూర్ మండలం జంగంపల్లికి చెందిన బందెల రవి.. తన అన్న బాలయ్య, బాలయ్య కూతురు లత, తన సొంత కూతురు చందనను శీతల పానీయంలో పురుగుల మందు కలిపి తాగించి... ఆపై గొంతు కోసి చంపేశాడు.

అనంతరం తాను కూడా గొంతు కోసుకుని సమీపంలోని గుండ్ల చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్నటి నుంచి రవి కోసం గాలించినా ఎక్కడా ఆచూకీ లభించలేదు. ఈరోజు చెరువులో మృత దేహం బయట పడింది. అన్న పెద్ద కూతురు దీప... తన భార్య తరఫు అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ఇది తట్టుకోలేక పోయిన రవి పరువు హత్యలకు పాల్పడ్డాడు. ఒక్క ప్రేమ వివాహం నలుగురిని మింగేయడం గ్రామస్థులను కలిచి వేసింది.

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments