ప్రధాని జన్ధన్ యోజన పథకం అద్భుతం : కిషన్రెడ్డి
కేంద్ర ప్రభుత్వం గురువారం నుంచి ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం అద్భుతమైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... ప్రతి కుటుంబం తప్పనిసరిగా రెండు ఖాతాలు ఓపెన్ చేయాలన్నారు. ఈ పథకం ద్వారా రూ.2 లక్షలు బీమా లభిస్తుందని చెప్పారు.
ఆరు నెలల అనంతరం ఖాతా నుంచి రూ.5 వేలు రుణం పొందవచ్చని తెలిపారు. రూ.5 వేలు రుణం తీర్చిన తర్వాత రూ.15 వేలు రుణం పొందే వెసులుబాటు ఉందని వివరించారు. కాగా, జగ్గారెడ్డి బీజేపీ టిక్కెట్పై మెదక్ లోక్సభ నుంచి పోటీ చేయడంపై టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడాన్ని కిషన్ కొట్టిపారేశారు. మాపై విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు.