Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా ఎక్స్‌ప్రెస్ రద్దు... రైల్వే అధికారుల వెల్లడి

Written By వరుణ్
Updated: మంగళవారం, 10 అక్టోబరు 2023 (13:12 IST)
సికింద్రాబాద్ రైల్వే డివిజన్ పరిధిలో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఆదిలాబాద్ - తిరుపతి ప్రాంతాల మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు చేశారు. ఈ విషయాన్ని విజయవాడ డివిజన్ అధికారులు వెల్లడించారు. గత రెండు వారాల్లో ఈ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అలాగే, మరో మూడు ప్యాసింజర్ రైళ్ళను కూడా ఈ నెల 15వ తేదీ వరకు రద్దు చేశారు. 
 
సికింద్రాబాద్ డివిజన్‌లో ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నెల 10, 11 తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ఇప్పటికే బుక్ చేసుకున్న వారికి నగదును తిరిగి చెల్లిస్తామని తెలిపారు. మరోవైపు, కాజీపేట - డోర్నకల్ మధ్య నడిచే డోర్నకల్ ప్యాసింజర్, సికింద్రాబాద్ - వరంగల్ మధ్య నడిచే పుష్‌పుల్, కాజీపేట - బల్లార్షా మధ్య నడిచే బల్లార్షా ఎక్స్‌ప్రెస్ రైళ్ళను కూడా ఈ నెల 15వ తేదీ వరకు రద్దు చేసినట్టు తెలిపారు. 

అన్నీ చూడండి

2027 మార్చి నాటికి వెయ్యికి పైగా ఒరిజినల్ మైక్రో డ్రామాలు, మీ ఫోనుల్లోనే ఇక స్టోరీ టీవీ

సీఎం విజయ్‌కి వున్న ఒకే ఒక్క టెన్షన్ అనగానే త్రిష... త్రిష అంటూ నినాదాలు, ఎక్కడ?

బాలీవుడ్‌లో నచ్చే పాత్రలు రావడం లేదు : హీరో సిద్ధార్థ్

సారీ సాయిపల్లవీ, నీకంటే నీ పక్కనే వున్నామే సీతగా బాగుంటుంది, ట్రోల్స్

చెన్నై లవ్ స్టోరీ విజయం ప్రేక్షకుల ప్రేమ, పరిశ్రమ ప్రశంసలే - రవి నంబూరి సత్తా

తర్వాతి కథనం
Show comments