సిరిసిల్లా జిల్లాలో చిరుతపులి సంచారం.. భయాందోళనలో జనం

ఆదివారం, 17 జనవరి 2021 (09:51 IST)
తెలంగాణలో గత కొన్ని రోజులుగా చిరుత పులుల సంచారం ఎక్కువైంది. చిరుత పులులు వనాలు విడిచి రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. అయితే తాజాగా రాజన్న సిరిసిల్లా జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి కొలువైన వేములవాడ సమీపంలో చిరుత సంచరించింది. 
 
మూడు రోజుల క్రితం బోయినపల్లి మండలం మల్కాపూర్ శివారులో కనిపించిన చిరుత, ఈ రోజు తెల్లవారుజామున వేములవాడ అర్బన్‌ మండలంలోని మారుపాక శివారులో సంచరించింది. పొలం పనులకు వెళ్లిన రైతులకు పులి అడుగుల గుర్తులు కనిపించాయి. 
 
ఈ విషయాన్ని రైతులు అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చిరుతపులి సంచారంతో వేములవాడ పరిసర ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. చిరుత సంచారం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 
 
ఇక, బోయినపల్లి మండలం మల్కాపూర్‌ శివారులోని వ్యవసాయ బావిలో చిరుతపులి కనిపించిన సంగతి తెలిసిందే. కోరెపు సురేష్‌కు చెందిన వ్యవసాయ బావిలో బుధవారం చిరుత పడి ఉండటాన్ని రైతులు గుర్తించారు. దీంతో రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు.

అన్నీ చూడండి

మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర వీణ పాటకు తమిళనాడు సీఎం విజయ్ స్టెప్పులు, వీడియో

Ghantadi Krishna: నా ఆశ నా శ్వాస సంగీతం, దర్శకత్వంతో రిస్క్ చేశా : ఘంటాడి కృష్ణ

VN Aditya: వినోదభరితంగా మన డాక్టర్ బాబే సినిమా: వీఎన్ ఆదిత్య

Kiran Abbavaram : ఛాట్ బస్టర్స్ గా దూసుకెళ్తున్న చెన్నై లవ్ స్టోరీ మూవీ

Dharma Mahesh : జీ5లో ట్రెండింగ్ టాప్-1గా ధర్మ మహేష్ చిత్రం డ్రింకర్ సాయి

తర్వాతి కథనం
Show comments