కౌలు డబ్బు ఇవ్వలేదని తల్లిపై పెట్రోల్ పోసి అంటించాడు

బుధవారం, 13 మే 2020 (21:31 IST)
తల్లి కౌలు డబ్బులు ఇవ్వలేదని మద్యం మత్తులో కొడుకు పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ గ్రామంలోని వడ్డెర కాలనీలో నివసిస్తున్న లసుంబాయికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. చాలా కాలం క్రితం భర్త చనిపోవడంతో తనకున్న ఐదు ఎకరాల భూమిని కౌలుకిచ్చి ఆ డబ్బుతో జీవనం సాగిస్తోంది. 
 
ఆమె సంపాదించిన డబ్బుపై పెద్ద కొడుకు నాందేవ్ కన్ను పడింది. ఆ డబ్బు కోసం తల్లితో ఎన్నోసార్లు గొడవపడ్డాడు. ఇటీవల కౌలు డబ్బు రావడంతో ఒంటరిగా ఉన్న తల్లి దగ్గరకు వెళ్లి డబ్బు ఇవ్వమని గొడవ చేసాడు. ఆమె ససేమిరా అనడంతో మద్యం మత్తులో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆమెకు శరీరం కాలి అరవడంతో కోడలు, కూతురు, స్థానికులు వచ్చి మంటలు ఆర్పారు. 
 
తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కొడుకు నాందేవ్, పెట్రోల్ అందించిన అతని భార్య దీపికపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments