తీపి కబురు చెప్పిన వాతావరణ శాఖ

సోమవారం, 16 మే 2022 (12:03 IST)
దేశం వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒకవైపు ఎండలు, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. 
 
వచ్చే 24 గంటల్లో భారత్‌లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వెల్లడించింది. అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు వస్తాయని తెలిపింది. ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ మహా సముద్రంలో రుతపవాలు విస్తరిస్తాయని వెల్లడించింది. 
 
ఆ తర్వాత ఈ నెలాఖరులోగా కేరళను తాకుతాయని చెప్పింది. జూన్ 8వ తేదీ లోగా తెలంగాణా రాష్ట్రంలోకి ఈ రుతుపవనాలు ప్రవేశిస్తాయని తెలిపింది. ఇదిలావుంటే, ఆదివారం రాత్రి తెలంగాణా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. 

అన్నీ చూడండి

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్

Nag Aswin: సింగీతం గారి స్టయిల్ లో సింగ్ గీతం ఫన్ సినిమా :నాగ్ అశ్విన్

Regina Cassandra: ప్రేమ, ద్రోహం, ప్రతీకారంతో నిండిన కథగా మరీచిక ట్రైలర్

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సహా 350కి పైగా టైటిల్స్‌ని డిజైన్ చేశా : పురుష: దర్శకుడు వీరు వులవల

తర్వాతి కథనం
Show comments