వైఎస్ షర్మిల వర్సెస్ ఎంపీ కవిత ట్విట్టర్ వార్

బుధవారం, 30 నవంబరు 2022 (17:42 IST)
తెలంగాణలో రాజకీయ నేతల ట్వీట్లు చర్చనీయాంశమైనాయి. తెలంగాణలో ప్రస్తుతం వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల నిరసన, నిర్భంధం, విడుదలకు సంబంధించిన వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ట్విట్టర్‌లో టీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌టీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. 
 
తన ట్వీట్లతో, బీజేపీ కూడా వార్ నడుపుతోంది. వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కె.కవిత మధ్య జరిగిన ట్విట్టర్‌ వాగ్వాదంతో పాటు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ వంటి ఇతర బీజేపీ నేతలు కూడా తమ ట్వీట్‌లతో విరుచుకుపడ్డారు.
 
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై చేసిన ట్వీట్లు పలువురి దృష్టిని ఆకర్షించాయి. నిరసన సమయంలో వైఎస్ షర్మిలతో వ్యవహరించిన తీరును ఆమె తప్పుబట్టారు.
 
అలాగే రాజకీయ నేతలు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కొండా సురేఖ ట్వీట్లను ట్యాగ్ చేస్తూ వైఎస్ షర్మిల ట్వీట్లను రీపోస్ట్ చేయడంతో, ఎమ్మెల్సీ కవిత వ్యంగ్య ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియా వేదికగా చర్చకు దారితీశాయి.

అన్నీ చూడండి

Peddi Tour: రామ్ చరణ్ పెద్ది పవర్‌ప్లే టూర్ ప్రారంభించింది

నిర్మాత, ఎగ్జిబిటర్ల మధ్య దూషణలు, థియేటర్ ఆదాయంపై వివాదం చెలరేగింది

జగపతి బాబు, ఆకెళ్ల వి కృష్ణ కాంబినేషన్ చిత్రం వదలా టైటిల్ సాంగ్ రిలీజ్

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

తర్వాతి కథనం
Show comments