వాతావరణ శాఖ చల్లని కబురు.. తెలంగాణలో వర్షాలు

సోమవారం, 23 అక్టోబరు 2023 (11:57 IST)
తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రెండు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు పలకరించనున్నాయి. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో.. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగా.. వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో కూడా రుతుపవనాల ప్రభావం కనిపించనుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
 
మరోవైపు.. ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకొని ఉన్న ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుందని ఐఎండీ పేర్కొంది. అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణిస్తూ.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 
 
ఈ రుతుపవనాల ప్రభావంతో.. ఈ నెల 24, 25 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. 

అన్నీ చూడండి

సినిమాపై అవగాహన లేని వ్యక్తికి సినిమాటోగ్రఫీ శాఖనా? సీఎం విజయ్‌పై విశాల్ ఫైర్

రజనీకాంత్‌తో పోటీపడతాను.. అసూయ లేదు : కమల్ హాసన్

నడిరోడ్డుపై నటి పావలా శ్యామల - నిర్మాత దిల్ రాజు పెద్ద మనసు

పెద్ది చిత్రం మల్లయోధుడు కోడి బయోపిక్ కాదు : డైరెక్టర్ బుచ్చిబాబు

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

తర్వాతి కథనం
Show comments