నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి

మంగళవారం, 11 జనవరి 2022 (13:41 IST)
నల్గొండలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది వివరాల్లోకి వెళితే.. దామరచర్ల మండలంకు చెందిన అన్నాచెల్లెళ్లు ధనావత్ అంజి(20), ధనావత్ అంజలి(17), వారి మేనల్లుడు రమావత్ నవదీప్(8) బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. 
 
బొత్తలపాలెం వద్దకు రాగానే ముందు ఉన్న ట్రాక్టర్‌ని బైక్‌ వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బైక్ పూర్తిగా ధ్వంసమైంది. మనవడితో సహా ఇద్దరు బిడ్డలు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

అన్నీ చూడండి

Sanjaydath: ది డెవిల్ ఆగ‌మ‌నం - కెడి: ది డెవిల్ ట్రైల‌ర్‌తో మాస్ హంగామా

అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా

Bramhi: కామెడీ, మిస్టరీ అంశాల‌తో మేము‘కాప్’లం ట్రైల‌ర్‌ కు బ్రహ్మానందం కితాబు

Kiran: తిమ్మరాజుపల్లి టీవీ చిత్రం నిర్మాతగా నాకెంతో సంతృప్తినిచ్చింది - కిరణ్ అబ్బవరం

Durgesh: ఆంధ్ర సినీ రాజధానిగా తిరుపతి - కందుల దుర్గేష్‌ ని కలిసిన పారడాక్స్ పిక్చర్స్ అధినేతలు

తర్వాతి కథనం
Show comments