గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పీడీ యాక్ట్: 12 నెలలపాటు నిర్భంధం

Written By సెల్వి
Updated: శనివారం, 29 అక్టోబరు 2022 (09:52 IST)
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను 12 నెలలపాటు నిర్భంధంలో వుండనున్నారు. కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా ప్రసంగించిన కేసుకు సంబంధించి పీడీ యాక్ట్ కింద ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్ట్ అయ్యారు. ఇంకా రాజా సింగ్‌ను 12 నెలలపాటు నిర్బంధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. 
 
రాజాసింగ్‌ను పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఆయన భార్య ఉషాభాయ్ హైకోర్టులో సవాలు చేశారు. జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ముజీబ్ కుమార్ సదాశివుని కోర్టులో వాదనలు వినిపించారు. 
 
కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా రాజాసింగ్ టీవీల్లో ప్రసంగించారని, వీటిని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పీడీ యాక్ట్ కింద నిర్బంధించామని తెలిపారు. ఆయన నిర్బంధాన్ని సలహా మండలి కూడా ఆమోదించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయనను 12 నెలలపాటు నిర్బంధిస్తూ ఈ నెల 19న జీవో జారీ చేసినట్టు వెల్లడించారు. 

అన్నీ చూడండి

బోరున విలపించిన కోలీవుడ్ నటి : ఎందుకో తెలుసా?

Manchu Lakshmi: సంప్రదాయ బోధనే చిన్నారుల ఎదుగులకు పునాది :మంచు లక్ష్మి

అందుకే బెనాక గోల్డ్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వున్నా : నాగబాబు

పెయిడ్ ప్రీమియర్స్ తో 3.13 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన చెన్నై లవ్ స్టోరీ

వంద దేవుళ్ళు మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన జీతెలుగు

తర్వాతి కథనం