ఓ కానిస్టేబుల్ అక్రమ వసూళ్లు... ట్విట్టర్‌ ద్వారా స్పందించిన డీజీపీ

శనివారం, 10 ఆగస్టు 2019 (21:29 IST)
కానిస్టేబుల్‌ అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవడంతో తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. వర్ధన్నపేట పోలీసుస్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ డబ్బులు వసూళ్లు చేస్తున్నట్లు ఉన్న వీడియోను షేర్‌ చేస్తూ వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌ను విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన ట్విట్టర్‌ ద్వారా ఆదేశించారు. 
 
ఇటీవల రెండు రోజుల క్రితం వర్ధన్నపేట సీఐ ఇసుక ర్యాంపులు, మద్యం దుకాణాలపై మామూళ్లు వసూలు చేస్తున్నట్లు సీపీ దృష్టికి వెళ్లడంతో అతనికి మెమో జారీ చేసినప్పటికీ, అదే స్టేషన్‌ పరిధిలో ఓ కానిస్టేబుల్‌ అక్రమ వసూళ్ల వీడియో వైరల్‌ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
 
ఆ వీడియోలో ఇసుక ట్రాక్టర్ల యాజమానుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయమై వర్ధన్నపేట ఏసీపీ మధుసూదన్‌ను వివరణ కోరగా ఉన్నతాధికారుల నుంచి విచారణ చేపట్టాలని ఉత్తర్వులు అందినట్లు పేర్కొన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆయన పేర్కొన్నారు.

అన్నీ చూడండి

Priyadarshi: ప్రియదర్శి నటిస్తున్న ఇడుపు కాయితం విడుదల తేదీ ఫిక్స్

Aishwarya: రహస్యాన్ని దాచి తిరు వీర్, ఐశ్వర్య ను పెళ్లి చేసుకుంటే ఏమయింది?

Nagarjuna: తిరుమల వేంకటేశ్వరుడే అఖిల్ కు సక్సెస్ ఇచ్చాడు : అక్కినేని నాగార్జున

అఖిల్ అక్కినేని 'లెనిల్' తొలి రోజు కలెక్షన్లు ఎంతో తెలుసా?

లెనిన్ అదుర్స్.. పండగ చేసుకుంటున్న జైనాబ్.. తొలి రోజు 16.7కోట్ల కలెక్షన్ (video)

తర్వాతి కథనం
Show comments