శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 8 ఆగస్టు 2019 (11:00 IST)

ఖాకీ కీచకుడు : మహిళా కానిస్టేబుల్స్ కళ్లెదుటే మహిళా ఖైదీపై రైలు బాత్రూమ్‌లో రేప్...

ఢిల్లీకి చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్ కీచకుడిగా మారిపోయాడు. పక్కనే ఇద్దరు సహచర మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారనే విషయాన్ని కూడా మరిచిపోయాడు. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళు పక్కనే ఉన్నప్పటికీ ఓ మహిళా ఖైదీపై రైలు బాత్రూంలో అత్యాచారం చేశాడు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో 42 యేళ్ళ మహిళ ఓ కేసులో అరెస్టు అయి ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తోంది. అయితే ఆమెను ముర్షీదాబాద్ కోర్టు (బెంగాల్ రాష్ట్రం)లో పరిచేందుకు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ళతో పాటు ఓ పురుష కానిస్టేబుల్ బందోబస్తుగా నియమించారు. 
 
దీంతో ఆ మహిళా ఖైదీని గట్టిబందోబస్తు మధ్య ముర్షీదాబాద్ కోర్టుకు తీసుకొచ్చి హాజరుపరిచారు. ఆ తర్వాత తిరిగి ఢిల్లీకి రైలులో బయలుదేరారు. ఈ క్రమంలో ఆ మహిళా ఖైదీపై కన్నేసిన కానిస్టేబుల్ ఆమె బాత్రూముకు వెళ్లిన సమయంలో మహిళా సిబ్బందిని వెనక్కి పంపి అతడు టాయిలెట్‌లో జొరబడి ఖైదీపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని ఆమెను బెదిరించాడు. జైలుకు వెళ్లాక కానిస్టేబుల్ అఘాయిత్యాన్ని బాధితురాలు జైలు సూపరింటెండెంట్‌కు, జైలు వైద్యుడికి చెప్పడంతో విషయం వెలుగు చూసింది. వారి సూచనతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.