సీఎం కేసీఆర్ నియంతలా మారడానికి కారణం అదే.. కోదండరాం

బుధవారం, 10 నవంబరు 2021 (16:26 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హిట్లర్‌ పుస్తకాలు చదివి సీఎం కేసీఆర్‌ నియంతలా మారారంటూ ధ్వజమెత్తారు. 
 
విద్యారంగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌ ధర్నాచౌక్‌లో డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(డీటీఎఫ్‌) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా చేశారు. దీనికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందన్నారు. 
 
ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని, స్వచ్ఛ కార్మికులను నియమించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆచార్య హరగోపాల్‌ మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను ప్రైవేటు దోపిడీకి వదిలేసిందని ఆరోపించారు. 

అన్నీ చూడండి

Nivetha Pethuraj: వెంకీ, చిరు సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన నివేదా పేతురాజ్

Madhura Sridhar: అలా చేయడంతో ఇండస్ట్రీ పరువు పోతుంది : మధుర శ్రీధర్ రెడ్డి

సందిగ్ధం విజయం సాధించాలని కోరుకుంటున్నా : తమ్మారెడ్డి భరద్వాజ్

Srikanth: మిడిల్ క్లాస్ కుటుంబాలందరికీ కనెక్ట్ అయ్యే మిస్టర్ మిడిల్ క్లాస్ :శ్రీకాంత్

Dil Raju: కథా బలమున్న చిల్డ్రన్ ఫిలిం సమ్మర్ హాలిడేస్ ఎంటర్ టైన్ చేయాలి : దిల్ రాజు

తర్వాతి కథనం
Show comments