Webdunia - Bharat's app for daily news and videos

Install App

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. వెయ్యి రూపాయల కోసం హత్య.. శవాన్ని డ్రమ్‌లో దాచి..?

Written By సెల్వి
Updated: శుక్రవారం, 21 ఆగస్టు 2020 (15:24 IST)
రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వెయ్యి రూపాయల కోసం స్నేహితుడిని దారుణంగా హత్యచేశాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా, చౌదరిగూడెం మండలం కాసులబాద్ గ్రామానికి చెందిన ఆంజనేయులు, రాజు అనే ఇద్దరు వ్యక్తులు స్నేహితులు.. ఇద్దరు కలిసి మద్యం తాగుతూ ఉండేవాళ్లు. వారం రోజుల క్రితం రాత్రి సమయంలో ఇద్దరు కలిసి మద్యం తాగి ఆంజనేయులు ఇంట్లో పడుతుకున్నారు. అయితే, మరుసటిరోజు ఆంజనేయులు నిద్రలేసేలోపే.. రాజు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.. ఆంజనేయులు ఇంట్లో దాచుకున్న వెయ్యి రూపాయలు మాయం అయ్యాయి.
 
ఇక, ఈ విషయంపై ఆంజనేయులు.. రాజును అడిగితే తాను తీయలేదని చెప్పినా.. మూడు రోజులు కనిపించకుండా పోయాడు. తిరిగి ఆగస్టు 15న ఇద్దరు కలుసుకున్నారు. మళ్లీ డబ్బుల గురించి ఆరా తీసినా పాత సమాధానమైన ఎదురైంది. ఇక, ఆ రాత్రి ఆంజనేయులు ఇంట్లోనే పడుకున్నారు రాజు నిద్రిస్తున్న సమయం చూసి తలపై కొట్టడంతో.. రాజు అక్కడికక్కడే మృతిచెందాడు. 
 
ఇక, ఏం చేయాలో తెలియక ఓ రోజు శవాన్ని డ్రమ్‌లో దాచాడు. మరుసటి రోజు మృతదేహాన్ని మూడు ముక్కలు చేశాడు. తలను ఓ దగ్గర, మొండెం మరో దగ్గర.. కాళ్ల భాగాన్ని ఇంకో దగ్గర పడేశాడు. ఇదే సమయంలో.. తన పర్సును కూడా పారేసుకున్నాడు.. పర్సు ఆధారంగా కేసును చేధించిన పోలీసులు.. ఆంజనేయులను అరెస్ట్ చేశారు.

అన్నీ చూడండి

ఎక్కువ మంది స్టార్లు ఉన్న చిత్రాల్లో నటించేందుకు జంకుతాను : నయనతార

మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియా గుడ్‌బై... 'ప్రేమలు' బ్యూటీ వెల్లడి

'వారణాసి' నుంచి కీలక అప్‌డేట్ - 'రుద్ర' ఫస్ట్‌లుక్ రిలీజ్

Toxic: trailer: బోల్డ్, రా, వైల్డ్, క్రేజీ, అంశాలతో యష్..కియారా అద్వానీ చిత్రం టాక్సిక్: ట్రైలర్

Allari Naresh: కీలక సన్నివేశాల చిత్రీకరణలో రంభ ఊర్వశి మేనక

తర్వాతి కథనం
Show comments