కేసీఆర్‌పై ఫైర్ అయిన షర్మిళ

మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (15:05 IST)
వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకువచ్చిన అభయహస్తం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం నీరుగార్చిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ విమర్శించారు. ట్విట్టర్‌లో తెలంగాణ సర్కారుపై విమర్శలు గుప్పించారు. 
 
2017వరకు అమలైన పథకంలో మార్పులు తీసుకొస్తామని చెప్పిన కేసీఆర్ సర్కార్.. ఐదేళ్లవుతున్నా ఇప్పటిదాకా అమలు చేసింది లేదని షర్మిల వెల్లడించారు. 
 
అభయహస్తం పథకం కింద డబ్బులు కట్టిన మహిళలకు తిరిగి ఇచ్చింది లేదు. ఇంటికో పెన్షనంటూ మెలికలు పెట్టి, పథకాన్ని అటకెక్కించి, వృద్ధాప్య మహిళలకు ఆర్థిక భరోసా లేకుండా చేశారు. 
 
ఆసరా పెన్షన్స్‌తో సంబంధం లేకుండా అభయహస్తం పథకాన్ని తిరిగి కొనసాగించాలని లేదంటే మహిళలు కట్టిన డబ్బులు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని షర్మిల డిమాండ్ చేశారు. 

అన్నీ చూడండి

Dhootha 2: నాగార్జున క్లాప్‌తో అమేజాన్ ప్రైమ్ దూత 2 ప్రారంభం

విజయ్ సేతుపతి, పూరి కాంబోల 'స్లమ్ డాగ్' టీజర్ జూన్ 8న రిలీజ్

పెద్ది సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ - తొలి రోజే రూ.135 కోట్లకు పైగా వసూలు

దుల్కర్ సల్మాన్ చేతుల మీదుగా ఫస్ట్ సింగిల్ సిగ్మా స్టయిల్ లాంఛ్

సోల్ ఆఫ్ లెనిన్‌కి థియేటర్లలో అద్భుతమైన స్పందన- జూన్ 26న మనోడు వస్తున్నాడు

తర్వాతి కథనం
Show comments