Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుధవారం ఉదయం వరకు ఆలయ దర్శనాలు బంద్.. ఎక్కడ?

Written By ఠాగూర్
Updated: సోమవారం, 24 అక్టోబరు 2022 (15:45 IST)
సూర్యగ్రహణం సందర్భంగా యాదగిరి గుట్ట దేవస్థానాన్ని మూసివేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. 25వ తేదీ బుధవారం ఉదయం 8.50 గంటల నుంచి 26వ తేదీ ఉదయం 8 గంటల వరకు ఆలయంలో ప్రవేశం ఉండదని ప్రకటించారు. గ్రహణం కారణంగా నిత్య, శాశ్వత కళ్యాణం, శాశ్వత బ్రహ్మోత్సవాలను కూడా రద్దు చేశారు. 
 
26వ తేదీన నిర్వహించే శతఘట్టాభిషేకం, సహస్రనామార్చన సైతం నిర్వహించబోమని అధికారులు ప్రకటించారు. బుధవారం సంప్రోక్షణ నిర్వహించిన అనంతరం ఉదయం 11 గంటలకు నుంచి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తామని తెలిపారు. 
 
అలాగే సూర్యగ్రహణం కారణంగా చిలుకూరి బాలాజీ ఆలయాన్ని సైతం మూసివేయనున్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి దర్శనాలు నిలిపివేస్తామని ఆలయ అర్చకులు ప్రకటించారు. సంప్రోక్షణ అనంతరం బుధవారం ఉదయం 6 గంటలకు భక్తులను అనుమతిస్తామని ప్రకటించారు. సూర్యగ్రహణం కారణంగా మంగళవారం రాష్ట్రంలోని అన్ని ఆలయాలు మూతపడనున్నాయి. భక్తులకు తిరిగి బుధవారం ఉదయమే దర్శన భాగ్యం కల్పించనున్నారు. 

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments