లాక్ డౌన్ ఉల్లంఘనలకు కఠిన చర్యలు: తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి

బుధవారం, 2 జూన్ 2021 (12:33 IST)
తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ పటిష్టంగా అమలు అవుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్య దృష్ట్యా లాక్ డౌన్ ను కొనసాగిస్తుందని, కరోనా వైరస్ చైన్ బ్రేక్ చేసే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ప్రజలందరూ తమకు సహకరించాలని అనవసరంగా రోడ్లపైకి రావద్దు అని సూచించారు.

డీజీపీ. రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, కమిషనరేట్స్ తో పాటు హైదరాబాద్ లో జన సాంద్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కఠినంగా పోలీసులు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు పటిష్టంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారని అనవసరంగా రోడ్లపైకి వస్తున్నా వారిపై కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి  తెలియజేసారు.

అంబులెన్సులు, ఎసెన్షియల్  వెహికల్స్, డాక్టర్స్, పారామెడికల్ సిబ్బంది , వ్యాక్సినేషన్ కి వెళ్లే వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.

అన్నీ చూడండి

director Ashok :భాగమతి దర్శకుడు అశోక్ పై కేసు నమోదు ?

Varun Tej : వరుణ్ తేజ్ చిత్రం కొరియన్ కనకరాజు డేట్ ఫిక్స్

రామ్ పోతినేని RAPO23 చిత్రానికి సామ్ సిఎస్ మ్యూజిక్

శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో మిస్టర్ మిడిల్ క్లాస్

Nikhil: రోషన్ కనకాల హీరోగా ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments