కరోనాపై తప్పుడు మెసేజ్‌లు సర్క్యులేట్‌ చేసేవారిపై కఠిన చర్యలు : సిపి సజ్జనార్‌

గురువారం, 5 మార్చి 2020 (05:17 IST)
రహేజా ఐటీపార్క్‌ మైండ్‌స్పేస్‌లో ఓ ఐటీ ఉద్యోగినికి కరోనా వైరస్‌ లక్షణాలు నిజమే.. కానీ, ఇంకా నిర్ధారణ కాలేదని సైబరాబాద్ సిపి సజ్జనార్‌ తెలిపారు.

కరోనా లక్షణాలున్న ఉద్యోగినితో సన్నిహితంగా ఉన్నవారికీ పరీక్షలు నిర్వహించారని చెప్పారు. కరోనాపై తప్పుడు మెసేజ్‌లు సర్క్యులేట్‌ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.

కరోనాపై తప్పుడు వార్తలతో పుకార్లు రేపుతున్నారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైందని చెప్పారు.

మైండ్‌స్పేస్‌ బిల్డింగ్‌లో కేవలం ఒక్క ఫ్లోర్‌ మాత్రమే ఖాళీ చేయించామన్నారు. మిగతా ఆఫీసులన్నీ యథావిధిగా పనిచేస్తాయని చెప్పారు.

అన్నీ చూడండి

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్ రాబోతోంది

ట్రెండింగ్‌: కరుప్పు చిత్రంలో నటి త్రిష కృష్ణన్‌ ఇల్లు

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

తర్వాతి కథనం
Show comments