Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ కళాశాలలు తెరిస్తే కఠిన చర్యలు

Written By ఎం
Updated: బుధవారం, 24 మార్చి 2021 (16:31 IST)
హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఇంటర్మీడియట్‌ కళాశాలలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ హెచ్చరించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కళాశాలలు మూసేయాలని యాజమాన్యాలను ఆదేశించారు.
 
ప్రత్యక్ష తరగతులు లేనప్పటికీ ఆన్‌లైన్‌ బోధనను కొనసాగించాలని చెప్పారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా తీవ్రత పెరుగుతున్నందున విద్యా సంస్థలన్నింటినీ బుధవారం నుంచి మూసివేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
 
మరోవైపు పదో తరగతి, ఇంటర్‌ వార్షిక పరీక్షలు జరుగుతాయా? లేదా అనే విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

అన్నీ చూడండి

Aamani: సీతాకోకలా విహరించే ఏడుగురు మహిళల హ్యాపీ జర్నీ

డెక్స్ట్రోకార్డియా ఉండే అరుదైన కథతో చిరంజీవి రాబోతోంది

Nani: నాని పోషించిన జడల్ పాత్ర ప్రమాదకరమైన గద్దలా ది ప్యారడైజ్ పోస్టర్

Ram: పాండిచ్చేరిలో RAPO23 కోసం పాట, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ

కుమార్తెకు దుర్గా సప్తశతి మంత్రాలను నేర్పిస్తున్న ప్రియాంకా చోప్రా

తర్వాతి కథనం
Show comments