Dharma Sangrah

పావు గంట ఆలస్యమైనా ప్రాక్టికల్స్‌కు అనుమతి

Written By ఠాగూర్
Updated: ఆదివారం, 20 మార్చి 2022 (11:21 IST)
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత సమయానికి పావు గంట ఆలస్యమైన ప్రాక్టికల్స్ పరీక్షా హాలుకు అనుమతిస్తామని తెలిపింది. 
 
ఈ నెల 23వ తేదీ నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ల్యాబ్‌కు 15 నిమిషాలు ఆలస్యమైన అనుమతిస్తామని తెలిపింది. ఆ తర్వాత మాత్రం అనుమతించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 
 
కాగా, విద్యార్థులు వారు చదువుకుంటున్న కాలేజీల్లోనే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తారు. జాగ్రఫీ విద్యార్థులకు మాత్రం ఈ నెల 31వ తేదీ నుంచి ఏప్రిల్ 9వ తేదీ వరకు ప్రాక్టిల్స్ నిర్వహించేలా ఏర్పాట్టు చేశారు. 
 
అలాగే, ఎగ్జామినర్లుగా నియమితులైన అధ్యాపక సిబ్బందిని కూడా విధుల నుంచి రిలీవ్ చేయాలని, లేదంటే రూ.5 వేల అపరాధం విధిస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. అలాగే, విద్యార్థులకు ఎగ్జామినర్లు వేసిన మార్కులను అదే రోజు రాత్రి 8 గంటల లోపు ఆన్‌లైన్‌లో బోర్డుకు పంపించాన్నారు. 

అన్నీ చూడండి

ఉన్నట్టుండి ఫ్రేమ్‌లోకి వచ్చిన త్రిష - ముఖం తిప్పేసుకున్న సీఎం విజయ్ (వీడియో)

రోహిత్‌ను త్రిగుణ్ వేధిస్తున్నాడు: మద్దతుగా నిలిచిన డెమోన్ పవన్

Dhruv Vikram: రమేష్ వర్మతో ద్విభాషా యాక్షన్ చిత్రంగా ధ్రువ్ విక్రమ్ షూట్

Trivikram Srinivas: ఆదర్శ కుటుంబం – AK47 టీజర్ వచ్చేసింది

Ram-Lakshman: మా అబ్బాయికి జడలు వేయించి యాక్షన్ చేయించాం : రామ్-లక్ష్మణ్

తర్వాతి కథనం
Show comments