తెలంగాణ : ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

శుక్రవారం, 10 డిశెంబరు 2021 (09:41 IST)
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల కోటాలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగనుంది. ఆరు స్థానాలకు జరిగే ఎన్నికల కోసం 37 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 
 
మెదక్, అదిలాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానానికి, కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలను బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రతను కల్పించారు. సీసీ టీవీ కెమెరాలతోపాటు వెబ్ కాస్టింగ్ చేయనున్నారు. ఈ ఓట్ల లెక్కింపు ఈ నెల 14వ తేదీన చేపడుతారు. 

అన్నీ చూడండి

జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ ఇమ్మోర్టల్ నుంచి రాకాసి సాంగ్

Rajamouli: ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ లూమియర్ వారి 'వాల్ ఆఫ్ ఫిల్మ్‌మేకర్స్'లో ఎస్.ఎస్. రాజమౌళి పేరు

జగపతి బాబు, లయ నటించిన వదలా చిత్రం రిలీజ్ కు సిద్ధం

Mythri Movie Makers: ధృవ్ విక్రమ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం

VISA – వింటారా సరదాగా రెండో గీతం చింగారి కి స్పందన

తర్వాతి కథనం
Show comments