Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీఎస్ డీఈఈ సెట్ ప్రిలిమినరీ కీ విడుదల

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 6 జూన్ 2023 (15:41 IST)
తెలంగాణ రాష్ట్రంలో రెండేళ్ల డీఈడీ కోర్సులో చేరేందుకు నిర్వహించిన డీఈఈ సెట్‌ ప్రిలిమినరీ కీ విడుదలైంది. తెలంగాణ వ్యాప్తంగా జూన్‌ ఒకటో తేదీన ఈ పరీక్ష జరగ్గా 79.40 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్ష కోసం మొత్తం 6,485 మంది దరఖాస్తు చేసుకోగా.. 5,144 మంది పరీక్ష రాసినట్టు డీఈఈ సెట్‌ కన్వీనర్‌ శ్రీనివాసాచారి వెల్లడించారు. 
 
తాజాగా అధికారులు ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. ఈ కీపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే జూన్‌ 8వ తేదీ సాయంత్రం 6 గంటల లోగా తెలపాలని విద్యార్థులకు సూచించారు. ఫలితాలను త్వరలోనే విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంటర్మీడియట్‌ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పొందాలనుకునేవారు రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సు చదవాల్సి ఉంటుంది. 

అన్నీ చూడండి

సందీప్ రెడ్డి వంగా సినిమా రోమాంచకం టైటిల్ సాంగ్ రిలీజ్

సత్యజిత్ రే, రాజమౌళి సినిమాలు ఇష్టపడతాను : దర్శకుడు ఉదయ్ చౌహాన్

jony master :దళారులు లేకుండా కళాకారులకు నేరుగా చెల్లింపులు : టీ.జి. విశ్వ ప్రసాద్

రూరల్ ఎంటర్‌టైనర్‌గా శివకార్తికేయన్ చిత్రం సెయాన్ రెండో షెడ్యూల్ షురూ

Haiwaan: అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్, డైరెక్టర్ ప్రియదర్శన్ ల హైవాన్ టీజర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments