సంబంధిత వార్తలు
- ఒడిశా ఘటన-రెస్క్యూ టీమ్లకు ప్రధాని మోదీ అభినందనలు
- కన్నీరు కార్చడం కాదు.. బాధితులకు శాశ్వత పరిష్కారం కావాలి.. సోనూసూద్
- ఒడిశా ఘటన.. 316 మంది ఏపీ వాసులు సేఫ్.. మంత్రి బొత్స ప్రకటన
- ఒడిశా రైలు ప్రమాదానికి కారకులైన వారికి తగిన శిక్ష.. ప్రధాని
- 1995కి తర్వాత 21వ శతాబ్దంలో అతిపెద్ద రైలు ప్రమాదం.. 300 మంది మృతి
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఆదివారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమైవుంది. దీనికితోడు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. శనివారం గరిష్టంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన విషయం తెల్సిందే. గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఉక్కపోత, రికార్డు స్థాయిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెల్సిందే.
ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం వాతావరణం కాస్త చల్లబడింది. ఉదయం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచే దుండిగల్, గండిమైసమ్మ, బహదూర్ పల్లి తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వాతవరణం కొద్దగా చల్లబడింది. ఆకాశం మేఘావృతమైవుంది.