1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 4 జూన్ 2023 (06:24 IST)

కన్నీరు కార్చడం కాదు.. బాధితులకు శాశ్వత పరిష్కారం కావాలి.. సోనూసూద్

SonuSood
ఒడిశా రైలు ప్రమాదంపై పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కరోనా ఆపద్భాంధవుడు, సినీ నటుడు సోనూసూద్ స్పందించారు. ఒడిశా రైలు ప్రమాద ఘటన హృదయ విదారకమైన ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ఒడిశా రైలు ప్రమాద ఘటన హృదయ విదారకమైనదని సోనూ అన్నారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంతాపం తెలపడంతో పాటు వీడియో సందేశాన్ని ఇచ్చారు. ప్రజలు కేవలం సోషల్ మీడియాలో కన్నీరు కార్చినంత మాత్రాన ఏమీ లాభం లేదని, సాధ్యమైనంత సాయం చేయాలని పిలుపునిచ్చారు. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు శాశ్వత పరిష్కారం కావాలన్న సోనుసూద్ అన్నారు. ఈ ఘటన పట్ల ప్రభుత్వం స్పందించిన తీరుపై సోనూసూద్ అభినందించారు. 
 
ఒడిశా రైలు ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలకు జీవితకాలం పెన్షన్లు లేదా స్థిరమైన నెలవారీ వేతనం చెల్లించాలని సోను సూద్ డిమాండ్ చేశారు. బాధితులకు కంటితుడుపు సహాయం కాకుండా శాశ్వత పరిహారం ఉండేలా చూడాలన్నారు.