Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ ఒకటి నుంచి తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ పరుగులు

Written By ఎం
Updated: గురువారం, 11 మార్చి 2021 (12:38 IST)
సికింద్రాబాద్ ‌- కాచిగూడ - కర్నూలు సిటీ తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి తిరిగి ప్రారంభంకానుంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో రద్దు చేసిన ఈ రైలు కోసం నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్నారు.
 
మహబూబ్‌నగర్‌లో పనిచేసే ఉద్యోగులు ఈ రైలులో వెళ్లి తిరిగి నగరానికి వస్తుంటారు. ఇది సికింద్రాబాద్‌లో ఉదయం 7.40 గంటలకు బయలుదేరి 7.50 గంటలకు కాచిగూడకు వస్తుంది. మలక్‌పేట, ఫలక్‌నుమా, ఉందానగర్‌ (శంషాబాద్‌), షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌కు (9.55 గంటలు), గద్వాల మీదుగా మధ్యాహ్నం 12.30 గంటలకు కర్నూలు నగరానికి చేరుకుంటుంది. 
 
తిరిగి ఈ రైలు కర్నూలులో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి మహబూబ్‌నగర్‌ (5.15 గంటలు) తదితర స్టేషన్ల మీదుగా రాత్రి 7.18 గంటలకు కాచిగూడకు, 7.55 గంటలకు తిరిగి సికింద్రాబాద్‌కు వస్తుంది. 

అన్నీ చూడండి

Prakash Raj: డార్లింగ్ కృష్ణ, ప్రకాష్ రాజ్ సినిమా ఫాదర్ టీజర్ రిలీజ్

king 100: నాగార్జున పుట్టినరోజు న కింగ్ 100 మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

Mandadi teaser: విజువల్స్, బోట్ సీక్వెన్స్ తో సుహాస్, సూరి ల మండాడి టీజర్

Taapsee Pannu : అప్పుడే మేము దానిని వేడుకలా జరుపుకుంటాం : తాప్సీ పన్ను

ప్రియదర్శి.. ఇడుపు కాయితం నుంచి శ్రీలత సాంగ్ ప్రోమో రిలీజ్

తర్వాతి కథనం
Show comments