రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని..

గురువారం, 3 ఫిబ్రవరి 2022 (18:14 IST)
వనపర్తి జిల్లాలోని ఆరేపల్లి వద్ద బీటెక్‌ విద్యార్థిని రైలు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లోనుంచి వెళ్లిన యువతి విగత జీవిగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లా నల్లగుంటకు చెందిన శ్రీవర్ష.. హైదరాబాద్‌లోని ఓ కాలేజీలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతుంది. 
 
కాలేజీకి వెళ్లేందుకు బుధవారం గద్వాల నుంచి బయలుదేరింది. ఈ క్రమంలో వనపర్తి జిల్లాలోని ఆరేపల్లి వద్ద రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అన్నీ చూడండి

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్ రాబోతోంది

ట్రెండింగ్‌: కరుప్పు చిత్రంలో నటి త్రిష కృష్ణన్‌ ఇల్లు

Rashi: ది రెడ్ బ్యాగ్ చిత్రంలో సావిత్రి అనే పవర్ ఫుల్ పాత్రలో రాశీ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ సినిమాకు సుధీర్ జోకర్ అనే టైటిల్ ఖరారు

Peddi trailer: మూడు విభిన్న క్రీడలతో హీరోగా ఎదిగిన కథతో పెద్ది ట్రైలర్

తర్వాతి కథనం
Show comments