మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీశాడు.. లోబరుచుకుని బ్లాక్‌మెయిల్ చేస్తూ..?

శుక్రవారం, 6 నవంబరు 2020 (15:55 IST)
వికారాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం గుడ్డిరుక్య తాండాకు చెందిన వివాహిత మహిళ అదే గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే కామాంధుడి చెరలో చిక్కిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా ఫోటోలు, విడియోలు తీసిన శ్రీనివాస్ మహిళను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. 
 
మహిళను శారీరకంగా లోబర్చుకోవడమే కాక ఆ సమయంలో కూడా వీడియోలు తీసి వాటిని ఫ్రెండ్స్ తో షేర్ చేస్తూ పైశాచికానందం పొందడం మొదలుపెట్టాడు. అలా షేర్ అయిన వీడియోలు ఒకరి దగ్గరి నుండి మరొకరికి చేరి అలా అలా చేతులు మారుతూ మహిళ కుటుంబ సభ్యులకు చేరింది. దీంతో బాదిత మహిళ భర్త కుల్కచర్ల పోలిసు స్టేషన్లో పిర్యాదు చేశారు. 
 
మా పైనే పోలీసులకు పిర్యాదు చేస్తారా అంటూ బాదితురాలి కుటుంబంపై శ్రీనివాస్ కుటుంబ సభ్యులు దాడికి తెగబడ్డారు. బాధితురాలికి అండగా ఉండవలసిన ఎస్సై కూడా శ్రీనివాస్ కుటుంబానికి వత్తాసు పలుకుతూ తమపై కేసులు చేశాడని బాధితురాలి సోదరుడు ప్రకాశ్ ఆరోపిస్తున్నారు.  

అన్నీ చూడండి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

తర్వాతి కథనం
Show comments