Webdunia - Bharat's app for daily news and videos

Install App

మినీ మున్సిపల్ ఎన్నికలు.. మద్యం దుకాణాలు తెరొవద్దు..

Written By సెల్వి
Updated: మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (10:54 IST)
తెలంగాణలో మినీ మున్సిపల్ ఎన్నికలపై ఎస్ఈసీ సమీక్ష నిర్వహించింది. ఎక్సైజ్ అధికారులతో ఎస్ఈసీ పార్థసారధి సమీక్షించారు. 2021, ఏప్రిల్ 30వ తేదీన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగనున్న సంగతి తెలిసిందే. 
 
పోలింగ్‌కు 48 గంటల ముందు.. కౌంటింగ్ ముందు, కౌంటింగ్ రోజు.. బెల్ట్ షాపులు, మద్యం దుకాణాలు తెరొవద్దని ఎస్ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రైవేటు వ్యక్తుల వద్ద అనుమతికి మించి మద్యం ఉండరాదని ఆదేశాలు జారీ చేసింది.
 
50 శాతానికి మించి మద్యం అమ్మకాలు జరిగితే.. ప్రత్యేక నిఘా పెట్టాలని పార్థసారధి సూచించారు. ప్రత్యేక చెక్ పోస్టులు పెట్టి.. అక్రమ మద్యం రవాణాను నివారించాలన్నారు. 
 
పోలీసులతో సమన్వయం చేసుకుని నిబంధనలను అమలు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని లింగోజిగూడ ఉప ఎన్నికపైనా కూడా ఆయన సమీక్షించారు. ఉప ఎన్నిక సజావుగా జరిగేందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

అన్నీ చూడండి

Vikranth: హారర్ కామెడీ చిత్రంలో హీరో విక్రాంత్

Sam C.S : సామ్ సి. ఎస్. 39వ పుట్టినరోజు 100వ సినిమా మైలురాయి

NTR: ఐ యామ్ గేమ్ ట్రైలర్ గ్రిప్పింగ్‌గా, ఎంగేజింగ్‌గా సాగింది: ఎన్టీఆర్

Sumanth: న్యూటన్స్ థర్డ్ లా ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది: సుమంత్

MS Raju: అక్కడకు వెళితే దెయ్యాలున్నాయనే వైబ్రేషన్ కు గురయ్యా: ఎంఎస్ రాజు

తర్వాతి కథనం
Show comments