Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్నాల‌జీతో మోసం చేస్తూ... అడ్డంగా బుక్కైన మాయ‌లేడి...

Written By శ్రీ
Updated: బుధవారం, 25 సెప్టెంబరు 2019 (17:32 IST)
టెక్నాల‌జీ స‌హాయంతో మోసం చేస్తూ.. డ‌బ్బులు వ‌సూలు చేస్తుంది ఓ యువ‌తి. ఇంత‌కీ ఏం చేస్తుందంటే... పలు పాఠశాలలకి చెందిన అఫీషియల్ ఫేస్‌బుక్ పేజ్ నుండి స్కూల్ ఫొటోలను డౌన్లోడ్ చేసి మార్ఫింగ్‌లకు పాల్పడి బ్లాక్‌మెయిల్ చేస్తుంది. ఆ ఫోటోలను తిరిగి బాధిత స్కూల్స్‌కి పంపిస్తుంది ఆ కిలాడి లేడి. 
 
తాను సైబర్ సెక్యూరిటీలో పని చేస్తున్నట్టు నమ్మించి ఈ ఫోటోలు తీసేస్తానని చెప్పి బాధితుల నుండి డబ్బు వసూలు చేస్తుంద‌ట‌. ఈ మాయ‌లేడీ బాగోతం బ‌య‌ట‌ప‌డ‌టంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. హైదరాబాదులో నాలుగు పాఠశాలలకి చెందిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయ‌డంతో ఇది వెలుగులోకి వ‌చ్చింది.
 
నిందితురాలిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసారు. నిందితురాలు సెల్ ఫోన్లో 225కు పైగా స్కూల్స్ గ్రూపు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉన్నత చదువు చదువుకున్న‌ప్ప‌టికీ ఈజీ మనీ కోసం టెక్నాలజీని వాడి ఈ తరహా నేరానికి పాల్ప‌డుతోంది.

అన్నీ చూడండి

ప్రభాస్ చిత్రం పౌర్ణమిలోని తెలుగు పాటకు చైనీస్ నర్తకి నాట్యం ట్రెండింగ్ వీడియో

మమ్ముట్టి మూవీ ‘ఓం: చాప్ట‌ర్‌1-ఉధిరం’ నుంచి వీడియో గ్లింప్స్

Fauzi Update: పోస్ట్‌ప్రొడక్షన్‌తో ఫౌజీ స్పీడ్.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన ప్రభాస్ ?

Sumanth: పవన్ కళ్యాణ్ గారికి వారాహి పాజిటివ్‌గా హెల్ప్ అయింది : సుమంత్

Anaswara Rajan look: కాకా చిత్రానికి అనస్వర రాజన్ హృదయం అని కితాబు

తర్వాతి కథనం
Show comments