Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ షర్మిల అరెస్ట్.. కేసీఆర్ పతనానికి ఇదే నాంది..

Written By సెల్వి
Updated: శుక్రవారం, 9 డిశెంబరు 2022 (16:10 IST)
YS sharmila
టీఆర్‌ఎస్‌ పాలనకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఆమె చేపట్టిన నిరాహార దీక్షకు అనుమతి లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. 
 
దీంతో ట్యాంక్‌బండ్‌లోని అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరాహార దీక్ష చేస్తున్న షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసు వాహనంలో బలవంతంగా తరలించారు. ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పక్కకు నెట్టి అరెస్టు చేశారు. 
 
ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ మరోసారి నాశనం చేశారని మండిపడ్డారు. కేసీఆర్‌కు తప్పులు చేసిన చరిత్ర ఉందని, ఆయన పతనానికి ఇదే నాంది అని ఆమె అభిప్రాయపడ్డారు. మరోవైపు షర్మిలపై ఆమెపై కేసు పెట్టే అవకాశం ఉంది.

అన్నీ చూడండి

ఓటరు కార్డు చిరునామా మార్చుకోమంటుంటే ప్రభుత్వాన్నే మార్చేస్తానంటారేంటి ప్రకాష్ రాజ్?!! వీడియో

హైదరాబాద్‌ను ఉర్రూతలూగించనున్న రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

Rahul Sipligunj Case: రాహుల్ సిప్లగింజ్ కేసు.. ఒకవేళ ఆమె రాకపోతే...?

దేవ కట్టా సమర్పణలో రా, రస్టిక్, రొమాంటిక్ కామెడీ చిత్రం జో జో’

నేను రెడీ నుంచి హవీష్, కావ్య థాపర్ పై మస్తుగుందిరా యవ్వారం సాంగ్

తర్వాతి కథనం
Show comments