నల్గొండలో వైఎస్ షర్మిల దీక్ష: ప్రతి మంగళవారం నిరాహార దీక్ష

మంగళవారం, 12 అక్టోబరు 2021 (16:34 IST)
నల్గొండలో వైఎస్ షర్మిల దీక్ష చేపట్టనున్నారు. నల్గొండ కేంద్రంలోని క్లాక్​టవర్​ వద్ద వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్​ షర్మిల.. నిరుద్యోగ నిరాహారదీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
తొలుత మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం వద్ద మాట్లాడిన అనంతరం ... నిరాహారదీక్ష వేదికకు చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించి ఆ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
 
ప్రతి మంగళవారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష వారం చేపడతానని షర్మిల వనపర్తి జిల్లా తాడిపత్రి పర్యటనలో చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో లక్షా 90 వేల వరకు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఆ పర్యటనలో తెలిపారు. వాటిని భర్తీ చేయాలనే డిమాండ్​తో ప్రతివారం ఒక్కో జిల్లాలో దీక్ష చేపడుతున్నారు. 
 
ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శిస్తూ దీక్ష చేపడుతున్నారు. అందులో భాగంగా ఈ వారం నల్గొండ కేంద్రంలో దీక్ష చేస్తున్నారు.

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments