వైఎస్ షర్మిల పార్టీ జెండా? 70శాతం పాలపిట్ట రంగు..?!

సోమవారం, 5 జులై 2021 (20:54 IST)
తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారు.. ఏపీ సీఎం జగన్ సోదరి షర్మిల. ఈ నెల 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా తన పార్టీ జెండాను, రాజకీయ అజెండాను ప్రకటించబోతున్నారు. 
 
ఇప్పటికే ఇందుకు సంబంధించి కసరత్తు పూర్తయ్యింది. ఇక షర్మిల కొత్త పార్టీకి సంబంధించిన జెండా ఎలా ఉండబోతోందనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా ఆమె పార్టీకి సంబంధించిన జెండా అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది.
 
70 శాతం పాల పిట్ట రంగు, 30 శాతం నీలం రంగు, మధ్యలో తెలంగాణ మ్యాప్, అందులో వైఎస్ఆర్ బొమ్మ.. ఇలా మొత్తం షర్మిల కొత్త పార్టీ జెండా సిద్ధమైందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. రాజకీయ పార్టీ పెట్టడానికి ముందే జిల్లాల్లో పర్యటించిన షర్మిల... తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తీసుకొస్తామని ప్రకటిస్తున్నారు. 

అన్నీ చూడండి

RAW NTR సంస్థకు జూ.ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదు!!

NTR Clarity: ఎన్.టి.ఆర్.పై వస్తున్న వార్తలకు ఎన్టీఆర్ కార్యాలయం వివరణ

Kalki 2 update: కల్కి సీక్వెల్ అప్‌డేట్, భారతాన్ని వక్రీకరిస్తున్న నాగ్ అశ్విన్ !

Balakrishna: తారక్ (జూ.ఎన్.టి.ఆర్.) రాజకీయ ప్రవేశంపై బాలక్రిష్ణ స్పందన హైలైట్

Sandeep Reddy Vanga: సత్యదేవ్ నటన సంచలనాత్మకం : రావు బహదూర్ పై సందీప్ రెడ్డి వంగా రివ్యూ

తర్వాతి కథనం
Show comments