మోసగాళ్లకు మోసగాడు ఎప్పుడొచ్చింది...? నష్టపోయానంటున్న కృష్ణ అల్లుడు సుధీర్ బాబు
సూపర్స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు హీరోగా నటించిన 'మోసగాళ్ళకు మోసగాడు' చిత్రం ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా తెలీకుండా రిలీజ్ చేశారు. రిలీజ్ తర్వాత మీడియా ఎక్కువగా... నెగెటివ్ టాక్తో స్ప్రడ్ చేయడంతో తాను చాలా నష్టపోయానని అంటున్నాడు. ఇదే విషయాన్ని నిర్మాత వెల్లడించాడు. దానికి కారణం, కొంతమంది నిర్మాతలు మీడియాపై పెట్టిన ఆంక్షలు గానీ.. వారిని చూసే విధానంలో గానీ తేడాలు వుండటంతో ఇలా జరిగిందని వాపోయినట్లు తెలిసింది.
ప్రమోషన్లో భాగంగా ఎవ్వరినీ పిలువకుండా రెండు ఛానల్స్, నాలుగు పేపర్లనే పిలిచారనే విషయం తనకు సినిమా రిలీజ్ తర్వాత తెలిసిందని వెల్లడించారు. ఈ విషయంలో కృష్ణ, విజయనిర్మల కూడా నిర్మాతల నిర్ణయంపై మండిపడుతున్నారు. కాంట్రవర్సీలకు దూరంగా వుండే ఆ కుటుంబంలో.. త్వరలో మూడో వారసుడు నరేష్ కొడుకు కూడా రాబోతున్నాడు.
సరే ఇవన్నీ పక్కన పెడితే.... సినీ ప్రేక్షకుల్ని ఒకటే కోరుకుంటున్నాను.. మీరు సినిమా చూసి బాగుందనుకుంటే నలుగురికి చెప్పండి. బాగోగపోతే పదిమందికి చెప్పండని సెంటిమెంట్ డైలాగ్లు వల్లిస్తున్నాడు సుధీర్ బాబు. మరి ఇప్పటికే శనిఆదివారాలు అయ్యాయి. కనుక ఈరోజు స్పందిస్తే.. తర్వాతైనా చూస్తారేమోనని ఆశ.