ఎన్టీఆర్ దెబ్బ‌కు డీలాప‌డ్డ క్రిష్‌.. హిట్ కోసం ప‌క్కా ప్లాన్

సోమవారం, 6 మే 2019 (20:55 IST)
గ‌మ్యం సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్‌. ఆ త‌ర్వాత వేదం, కృష్ణం వందే జ‌గ‌ద్గురుమ్, కంచె, గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి.. ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కించి త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్నాడు. అయితే... నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌ను ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ఎన్టీఆర్ మ‌హా నాయ‌కుడు అని రెండు పార్టులుగా తీయ‌డం తెలిసిందే.
 
ఈ సినిమా డిజాష్ట‌ర్ అయి షాక్ ఇచ్చింది. దీనికితోడు మ‌ణిక‌ర్ణిక సినిమా వివాదాస్ప‌దం కావ‌డంతో క్రిష్ బాగా డీలాప‌డ్డాడు. దీంతో క్రిష్ నెక్ట్స్ ఎలాంటి సినిమా చేయ‌నున్నాడు అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. క్రిష్ తన తరవాత సినిమా తెలుగులో చేయడంలేదని టాక్. ఆయన మళ్లీ బాలీవుడ్‌కు వెళ్లనున్నారని సమాచారం. 
 
కాగా ఇప్పటికే తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఠాగూర్’ సినిమాను హిందీలో ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’గా తెరకెక్కించారు క్రిష్. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. 
 
తనకు బాలీవుడ్లో ఫ‌స్ట్ ఛాన్స్ ఇచ్చిన‌ అక్షయ్ కుమార్‌నే మళ్లీ క్రిష్ సంప్రదించారని అంటున్నారు. ఇప్పటికే అక్షయ్‌కు క్రిష్ కథ చెప్పారట. ఆయన కూడా సానుకూలంగానే ఉన్నారని సమాచారం. అయితే.. ఇంకా స్క్రిప్ట్‌ను ఫైనలైజ్ చేయలేదని అంటున్నారు. మొత్తానికి క్రిష్ తరువాత సినిమా బాలీవుడ్‌లో చేయడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ వార్తల్లో వాస్త‌వం ఎంతో తెలియాల్సివుంది.

అన్నీ చూడండి

ప్రమాదంలో గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ను రక్షించిన బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్

సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్

నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం.. జూన్ 2 నుంచి 4 మధ్య కేరళలోకి...

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? ఏఐసీసీ ఏమంటోంది?

బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.8.70 కోట్లు మాయం.. లక్కీ భాస్కర్ తరహాలో...? (video)

అన్నీ చూడండి

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

మండుటెండలో నుంచి చల్లటి నీరు తాగితే...

నువ్వుల నూనెతో ప్రయోజనాలు ఏమిటి?

మెంతి ఆకుల పేస్టుతో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments