టాలీవుడ్‌లో మకుటంలేని మహారాజు ఎవరు? రవితేజ చెప్పిన ఆన్సర్ ఏంటి?

గురువారం, 30 జనవరి 2020 (11:56 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్రహీరోల్లో చిరంజీవి ఒకరు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉన్నారు. అలాంటి చిరంజీవి గురించి మాస్ మహాజారాగా గుర్తింపు పొందిన రవితేజ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 
 
అరవై యేళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోల‌తో పోటీపడుతూ చిత్రాలు చేస్తున్న చిరంజీవి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సొంతం చేసుకున్నారు. త్వ‌ర‌లో త‌న 152వ సినిమ‌తో ప‌ల‌క‌రించ‌నున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
అలాంటి చిరంజీవిపై మరో టాలీవుడ్ హీరో ర‌వితేజ ప్ర‌శంస‌లు కురిపించారు. రవితేజ నటించిన తాజా చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో నేనంటే 35 ఏళ్ళు ఐస్‌లో గడ్డ క‌ట్టేసేలా ఉన్నాను. ఆయ‌నేంటి ఇంకా అలానే ఉన్నారు అని ర‌వితేజ‌.. వెన్నెల కిషోర్‌తో చెబుతాడు. 
 
దీనికి వెన్నెల కిషోర్ ఐస్‌లో కాదు ఫ్యాన్స్ గుండెల్లో ఉన్నాడ‌ని అంటాడు. దీనికి సంబంధించిన డైలాగ్ వీడియోని చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ వీడియో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది. వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన డిస్కోరాజా చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించ‌గా, ఈ చిత్రం మ‌రిన్ని వ‌సూళ్ళు రాబ‌ట్టేందుకు మేక‌ర్స్ వినూత్న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అన్నీ చూడండి

హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ కార్యకలాపాల విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లో రుణ వితరణ: రూ.393.17 కోట్ల రుణాలను మంజూరు చేసిన కెనరా బ్యాంక్, రూ. 36.85 లక్షల సీఎస్ఆర్ సాయం

వందేమాతరాన్ని అవమానిస్తే మూడేళ్ల జైలుశిక్ష : కేంద్రం

నెలకు ఇంటి అద్దె రూ.80 వేలు.. అయినా క్యాబ్ డ్రైవర్

నిలకడగా వాంగ్‌చుక్ ఆరోగ్యం... కాక్రోచ్ మార్చ్‌ను విజయవంతం చేయాలంటూ పిలుపు

అన్నీ చూడండి

సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ మూవ్‌మెంటమ్ 2026

గర్భిణీలకు ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎందుకు?

ఈ వర్షాకాలంలో కాలిఫోర్నియా బాదంతో మీ కుటుంబ రోగనిరోధక శక్తిని పదిలంగా ఉంచుకోండి

ఈ ఆహారంతో బ్లడ్ క్లాట్స్

హైదరాబాద్‌లో అత్యాధునిక ఐసీయూ ఏర్పాటుకు మెడ్‌ట్రానిక్, అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యం

తర్వాతి కథనం
Show comments