Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాలీవుడ్‌లో మకుటంలేని మహారాజు ఎవరు? రవితేజ చెప్పిన ఆన్సర్ ఏంటి?

Written By ఠాగూర్
Updated: గురువారం, 30 జనవరి 2020 (11:58 IST)
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్రహీరోల్లో చిరంజీవి ఒకరు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉన్నారు. అలాంటి చిరంజీవి గురించి మాస్ మహాజారాగా గుర్తింపు పొందిన రవితేజ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. 
 
అరవై యేళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోల‌తో పోటీపడుతూ చిత్రాలు చేస్తున్న చిరంజీవి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ సొంతం చేసుకున్నారు. త్వ‌ర‌లో త‌న 152వ సినిమ‌తో ప‌ల‌క‌రించ‌నున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. 
 
అలాంటి చిరంజీవిపై మరో టాలీవుడ్ హీరో ర‌వితేజ ప్ర‌శంస‌లు కురిపించారు. రవితేజ నటించిన తాజా చిత్రం డిస్కోరాజా. ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రంలో నేనంటే 35 ఏళ్ళు ఐస్‌లో గడ్డ క‌ట్టేసేలా ఉన్నాను. ఆయ‌నేంటి ఇంకా అలానే ఉన్నారు అని ర‌వితేజ‌.. వెన్నెల కిషోర్‌తో చెబుతాడు. 
 
దీనికి వెన్నెల కిషోర్ ఐస్‌లో కాదు ఫ్యాన్స్ గుండెల్లో ఉన్నాడ‌ని అంటాడు. దీనికి సంబంధించిన డైలాగ్ వీడియోని చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ వీడియో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటుంది. వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన డిస్కోరాజా చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించ‌గా, ఈ చిత్రం మ‌రిన్ని వ‌సూళ్ళు రాబ‌ట్టేందుకు మేక‌ర్స్ వినూత్న ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

అన్నీ చూడండి

ఆర్మీ మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ - మాజీ హవిల్దార్‌కు కస్టడీ

తిరుమలకు చేరుకున్న ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సులు

తన తప్పునకు మూల్యం చెల్లించుకుంటున్నా : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ

యువతులతో ఏకాంత వీడియోలు... వ్యక్తి ప్రాణాలు తీశాయ్.. ఎలా?

భారత్‌ను లక్ష్యంగా చేసుకుని అల్‌ఖైదా చీఫ్ లాడెన్ దాడులు

అన్నీ చూడండి

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk

నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం

salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?

ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments