తెరుచుకున్న ధర్మస్థలి తలుపులు... సిద్ధ న్యూ లుక్ రిలీజ్

శనివారం, 10 జులై 2021 (17:11 IST)
మెగాస్టార్ చిరంజీవి -  దర్శకుడు కొరటల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చెర్రీ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇపుడు ఆఖరి షెడ్యూల్‌లో అడుగుపెట్టింది. 
 
కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి కారణంగా చిత్ర షూటింగ్‌ను నిలిపివేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో 'ఆచార్య' షూటింగ్ మళ్లీ ప్రారంభమైందని చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొ కంపెనీ వెల్లడించింది. 
 
"ధర్మస్థలి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి" అంటూ ట్వీట్ చేసింది. అందరినీ అలరించేలా త్వరలోనే 'ఆచార్య' నుంచి అప్ డేట్లు రానున్నాయని తెలిపింది. కొణిదెల ప్రొ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక. రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

అన్నీ చూడండి

పుచ్చకాయలు తిన్న తండ్రీకొడుకులు, తండ్రి మృతి, కొడుకు పరిస్థితి విషమం

ఏసీ స్లీపర్ బస్సులో మంటలు.. తొక్కిసలాటలో సీటు కిందకి చిన్నారి.. సజీవ దహనం

Revanth in National Politics: 2034 వరకు సీఎం.. ఆ తర్వాత జాతీయ రాజకీయాలు.. రేవంత్ రెడ్డి

Bandi Sai Bageerath: బండి సాయి భగీరథ్‌కు పోలీసుల లుక్ అవుట్ నోటీసు

ఆ వేదిక కేవలం అమ్మాయిల కోసమే.. మగాళ్ళు లింగ మార్పిడి చేయించుకున్నారా... ఏంటి? ఎలాన్ మస్క్

అన్నీ చూడండి

బ్యాడ్ కొలెస్ట్రాల్ వుందా, ఇలా వదిలించుకోవచ్చు

మీ చాయ్‌: ఆంధ్రప్రదేశ్‌లో టీ కల్తీపై అవగాహన కల్పిస్తోన్న టాటా టీ చక్ర గోల్డ్ జెమిని

వాతావరణ మార్పులు, ప్రజల నేత్ర ఆరోగ్యం: తలెత్తుతున్న ఆందోళనలు

మితిమీరి గోధుమ రోటీలను తింటే ఏమవుతుంది?

వేసవిలో డీహైడ్రేషన్‌ రాకుండా వుండాలంటే...?

తర్వాతి కథనం
Show comments