Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరుచుకున్న ధర్మస్థలి తలుపులు... సిద్ధ న్యూ లుక్ రిలీజ్

Written By ఠాగూర్
Updated: శనివారం, 10 జులై 2021 (17:12 IST)
మెగాస్టార్ చిరంజీవి -  దర్శకుడు కొరటల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రంలో రామ్ చరణ్ కూడా నటిస్తున్నారు. చెర్రీ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇపుడు ఆఖరి షెడ్యూల్‌లో అడుగుపెట్టింది. 
 
కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి కారణంగా చిత్ర షూటింగ్‌ను నిలిపివేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో 'ఆచార్య' షూటింగ్ మళ్లీ ప్రారంభమైందని చిత్ర నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొ కంపెనీ వెల్లడించింది. 
 
"ధర్మస్థలి తలుపులు మళ్లీ తెరుచుకున్నాయి" అంటూ ట్వీట్ చేసింది. అందరినీ అలరించేలా త్వరలోనే 'ఆచార్య' నుంచి అప్ డేట్లు రానున్నాయని తెలిపింది. కొణిదెల ప్రొ కంపెనీ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక. రామ్ చరణ్ సరసన పూజ హెగ్డే నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

అన్నీ చూడండి

శుభమా అని గృహ ప్రవేశం చేస్తుంటే, రూ. 50 వేలు ఇవ్వలేదని హిజ్రాలు డ్రెస్ అంతా ఎత్తి చూపించారు, వీడియో

నవంబరు నుంచి కొన్ని రైళ్ల రాకపోకల వేళల్లో మార్పులు...

ప్రియురాలికి ఐ-ఫోన్ బహుమతి ఇచ్చేందుకు గంజాయి స్మగ్లింగ్, ఖమ్మం వద్దకు రాగానే...

మా అమ్మ గొంతును ఎవరూ నొక్కలేరు.. సీఎం రేవంత్‌ రెడ్డిని శపిస్తున్నాను : కొండా సుష్మిత

'మహారాష్ట్ర ఆడపులి' ముగ్గురు పిల్లలతో ఆత్మహత్య

అన్నీ చూడండి

క్రమరహిత గుండె లయ: లయ సంబంధిత సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స

డిమెన్షియాను ముందుగానే గుర్తించి నిర్ధారించాలని పిలుపునిచ్చిన టాటా ట్రస్ట్స్

గ్రాము దాల్చిన చెక్క పొడిని తగినంత తేనెతో కలిపి తీసుకుంటే?

మహిళలు - చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా మా కావేరీ స్పెషాలిటీ ఆస్పత్రి

మధుమేహం వున్నవారు పిస్తా పప్పులు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments