Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏప్రిల్ 28 ఏమిజరిగింది!

Written By డీవీ
Updated: సోమవారం, 4 జనవరి 2021 (13:16 IST)
సినీ ర‌చ‌యిత‌ల సంఘం తొలి స‌భ్యుడు, ఆయుర్వేద డాక్ట‌ర్ ఏల్చూరి వార‌సుడు ఏల్చూరి రంజిత్ క‌థానాయ‌కుడిగా మారాడు. ఆయన న‌టిస్తున్న చిత్రం `ఏప్రిల్ 28 ఏమిజరిగింది`. శేర్రి అగర్వాల్  క‌థానాయిక‌. అజయ్, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. వి జి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వీర స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర క‌థ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైల‌ర్  నారా రోహిత్ విడుదల చేశారు. 
 
హీరో క‌థ‌లో ర‌చ‌యిత‌. త‌ను రాసుకున్న క‌థ‌ను బ‌ట్టి ఓ భ‌వంతిలోకి వెళ్ళ‌గానే అక్క‌డ అత‌నికి జ్ఞాప‌కాలు గుర్తుకువ స్తాయి. అవి ఏమిట‌నేది చిత్రంలో చూడాల్సిందేన‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈనెల‌లో ఈ సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి ప‌రుచూరి గోపాల‌కృష్ణ, హీరో శ్రీ‌విష్ణులు యూట్యూబ్ వీడియో మాట్లాడుతూ.. ఏల్చూరి వార‌సుడు తీసిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని ఆకాంక్షించారు. 
 
రామానాయుడు స్టూడియోలో ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ అనంత‌రం నారా రోహిత్ మాట్లాడుతూ.. రంజిత్ నాకు మంచి స్నేహితుడు. హీరోగా మంచి సినిమాలో తెలుగులో ఆరంభించారు. థ్రిల్ల‌ర్ సినిమాల‌కు మంచి ఆద‌ర‌ణ వుంటుంది. త‌ప్ప‌కుండా ఈ సినిమా విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు.
 
రంజిత్ మాట్లాడుతూ... అవ‌ధి అనే క‌న్న‌డ సినిమా చేశాను. ఆ త‌ర్వాత గ్యాప్ వ‌చ్చింది. ఇది 2వ సినిమా. తెలుగులో మొద‌టి సినిమా. నిర్మాత సినిమా ముందుకురావ‌డానికి స‌హ‌క‌రించారు. ఈ చిత్ర క‌థ చాలా భిన్నంగా వుంటుంది. గ‌తంలో వ‌చ్చిన థ్రిల్ల‌ర్‌ల కంటే ఆస‌క్తిక‌రంగా వుంటుంది. ద‌ర్శ‌క‌ుడు మ‌లిచిన తీరు అద్భుతంగా వుంది. ఈ జ‌న‌వ‌రిలో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు.

అన్నీ చూడండి

అలాంటి వ్యక్తి రాష్ట్రాధినేత అయితే ఆ దేవుడే కాపాడాలి : ఉదయనిధిపై ఖుష్బూ మండిపాటు

ఏపీలో వైకాపా నేతల పాపం పండుతోంది... కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్టు

ఉదయనిధి సభలో త్రిష నినాదాలు - నీళ్లు అక్కడికే చేరాలంటూ కామెంట్స్... టీవీకే నేతల ఫైర్

సహజీవనం చేసే మహిళను వేధిస్తే ఇక జైలే : సుప్రీంకోర్టు

డోనాల్డ్ ట్రంప్‌కు కొత్త చిక్కు - సుంకాలపై కోర్టుకెక్కిన 25 రాష్ట్రాలు

అన్నీ చూడండి

మూత్రపిండాల సమస్య వున్నవారు కొబ్బరి నీరు తాగితే ఏమవుతుంది?

ఇక డాక్టర్ల పని అయిపోయినట్లేనా, రానున్న 3 ఏళ్లలో ఆస్టిమస్ రోబోలే బెస్ట్ డాక్టర్స్ అంట, నిజమా?!!

మీ ఉదయానికి శక్తినివ్వండి: మీ అల్పాహారంలో కాలిఫోర్నియా బాదం ఎందుకు ఉండాలంటే?

ఎస్ఆర్ఎం ప్రైమ్ జోన్ ఫ్రీ కార్డు ఆవిష్కరణ - చెన్నై నగర వాసులకు ఆరోగ్య సంరక్షణ సేవలు

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్‌బకరా పండ్లు తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments