ఏప్రిల్ 28 ఏమిజరిగింది!

సోమవారం, 4 జనవరి 2021 (13:15 IST)
సినీ ర‌చ‌యిత‌ల సంఘం తొలి స‌భ్యుడు, ఆయుర్వేద డాక్ట‌ర్ ఏల్చూరి వార‌సుడు ఏల్చూరి రంజిత్ క‌థానాయ‌కుడిగా మారాడు. ఆయన న‌టిస్తున్న చిత్రం `ఏప్రిల్ 28 ఏమిజరిగింది`. శేర్రి అగర్వాల్  క‌థానాయిక‌. అజయ్, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. వి జి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వీర స్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్ర క‌థ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైల‌ర్  నారా రోహిత్ విడుదల చేశారు. 
 
హీరో క‌థ‌లో ర‌చ‌యిత‌. త‌ను రాసుకున్న క‌థ‌ను బ‌ట్టి ఓ భ‌వంతిలోకి వెళ్ళ‌గానే అక్క‌డ అత‌నికి జ్ఞాప‌కాలు గుర్తుకువ స్తాయి. అవి ఏమిట‌నేది చిత్రంలో చూడాల్సిందేన‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈనెల‌లో ఈ సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం గురించి ప‌రుచూరి గోపాల‌కృష్ణ, హీరో శ్రీ‌విష్ణులు యూట్యూబ్ వీడియో మాట్లాడుతూ.. ఏల్చూరి వార‌సుడు తీసిన ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించాల‌ని ఆకాంక్షించారు. 
 
రామానాయుడు స్టూడియోలో ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ అనంత‌రం నారా రోహిత్ మాట్లాడుతూ.. రంజిత్ నాకు మంచి స్నేహితుడు. హీరోగా మంచి సినిమాలో తెలుగులో ఆరంభించారు. థ్రిల్ల‌ర్ సినిమాల‌కు మంచి ఆద‌ర‌ణ వుంటుంది. త‌ప్ప‌కుండా ఈ సినిమా విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్నాన‌ని అన్నారు.
 
రంజిత్ మాట్లాడుతూ... అవ‌ధి అనే క‌న్న‌డ సినిమా చేశాను. ఆ త‌ర్వాత గ్యాప్ వ‌చ్చింది. ఇది 2వ సినిమా. తెలుగులో మొద‌టి సినిమా. నిర్మాత సినిమా ముందుకురావ‌డానికి స‌హ‌క‌రించారు. ఈ చిత్ర క‌థ చాలా భిన్నంగా వుంటుంది. గ‌తంలో వ‌చ్చిన థ్రిల్ల‌ర్‌ల కంటే ఆస‌క్తిక‌రంగా వుంటుంది. ద‌ర్శ‌క‌ుడు మ‌లిచిన తీరు అద్భుతంగా వుంది. ఈ జ‌న‌వ‌రిలో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు.

అన్నీ చూడండి

రోడ్డుపై వేగంగా కదిలే స్కూటర్ హ్యాండిల్ వదిలేసి కూర్చుని ఫీట్స్, వీడియో

సినీ రంగంలో తాగుబోతులు, తిరుగుబోతులే వుంటారు: సినీ పరిశ్రమపై పాశం యాదగిరి దారుణ వ్యాఖ్యలు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన కానిస్టేబుల్.. కాంట్రాక్ట్ ఉద్యోగి సేఫ్

విద్యుత్ ట్రాన్స్‌మిషన్ సత్తాపై ఆధారపడిన ఆంధ్రప్రదేశ్ AI ఆశలు

సరస్వతి పుష్కరాలకు టీఎస్‌టీడీసీ ప్రత్యేక ప్యాకేజీ పర్యటన

అన్నీ చూడండి

తిప్పతీగ ఆయుర్వేద ప్రయోజనాలు

కిడ్నీ సమస్య వుందని తెలిపే సంకేతాలు

శస్త్రచికిత్స లేకుండానే 4 ఏళ్ల చిన్నారి గుండెలో రంధ్రాన్ని విజయవంతంగా మూసిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు

మంచినీటిలో నానబెట్టి తినాల్సిన ఆహారాలు ఏమిటి?

తీపి పదార్థాలను మోతాదుకి మించి తింటే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments