Prudhvi Raj: 150 మేకలు 11 మేకలు.. వైకాపా వాళ్లు రోడ్డు మీద పందులకు పుట్టారా? (video)
లైలా మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ పృథ్వీ చేసిన రచ్చ ఇంకా కొనసాగుతోంది. 150 మేకలు 11 మేకలు అంటూ ఆయన చేసిన కామెంట్స్పై వైకాపా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పృథ్వీ చేసిన ఈ పొలిటికల్ కామెంట్స్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని.. క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది. అంతేకాదు సోషల్ మీడియా వేదికగా #BoycotLaila ట్రెండ్ చేస్తోంది.
పృథ్వీ కామెంట్స్కు హీరో విశ్వక్ సేన్ సారీ చెప్పినా ఈ బాయ్ కాట్ ట్రెండ్ ఆగడం లేదు. పృథ్వీనే క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ట్రోల్స్ కారణంగా ఆస్పత్రిలో చేరారు పృథ్వీ.
పృథ్వీ హై బీపీతో బాధపడుతున్నట్లు సభ్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా వైసీపీకి, జగన్కు క్షమాపణలు చెప్పేది లేదని.. పృథ్వీరాజ్ తెలిపాడు. సినిమాను సినిమా లాగా చూడాలని... రాజకీయాల్లోకి లాగొద్దంటూ.. వైసిపి నేతలను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు పృథ్వీరాజ్.
ఆసుపత్రి బెడ్ పైన పడుకొని మాట్లాడుతూ.... అనవసరంగా తన తల్లిని ఈ విషయంలోకి లాగారని వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ నేతలకు 11 అనే పేరు చెప్పగానే వణుకు పుడుతుందని చురకలాంటించారు. 400 ఫోన్ కాల్స్ టార్చర్ పెట్టారని.. వైకాపా వాళ్లు రోడ్డు మీద పందులకు పుట్టారా? అంటూ ఫైర్ అయ్యారు.