ప్రియురాలు ఆ పని చేయడంతో అర్థరాత్రి అల్లాడిపోయిన చెన్నై ప్రియుడు

ఆదివారం, 11 నవంబరు 2018 (20:53 IST)
అతడు ఉద్యోగరీత్యా వుండేది చెన్నై మహానగరంలో. కానీ ప్రేయసి కోసం ఒడిశా వెళ్తుంటాడు. ఎందుకంటే అతడి స్వగ్రామం కూడా ఒడిశా లోని కియోంజర్ జిల్లా బదుగావ్ గ్రామం. వివరాల్లోకి వెళితే... 25 ఏళ్ల రాజేంద్ర నాయక్ చెన్నైలో ఉద్యోగం చేస్తున్నాడు. ఐతే అప్పుడప్పుడు తన స్వంత వూరికి కూడా వెళ్తుంటాడు. అక్కడ అతడికి ప్రియురాలు వుంది. సొంత ఊరుకి వెళ్లడంతో పాటు ప్రేయసితో కూడా గడపడం చేస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా ఆమె ఇంటికి వెళ్లాడు. 
 
అర్థరాత్రి ఇద్దరి మధ్య ఏదో విషయంపై గొడవ వచ్చింది. ఐతే ఆ గొడవ ముగియగానే ప్రియుడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. కానీ ప్రేయసికి మాత్రం నిద్రపట్టలేదు. దీనితో అతడిపై కసితో రగిలిపోయిన సదరు మహిళ వంటింట్లో వున్న పదునైన కత్తి తీసుకుని వచ్చి అతడి మర్మాంగాన్ని ఒక్కవేటుతో కోసేసింది. అతడు చావు కేకలు పెట్టాడు. 
 
ఆ కేకలు విన్న ఇరుగుపొరుగు వారు వచ్చి చూడగా రక్తపు మడుగులో అతడు కొట్టుమిట్టాడుతున్నాడు. వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా వున్నట్లు వైద్యులు చెప్పారు. ఐతే ఘాతుకానికి పాల్పడ్డ మహిళపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అన్నీ చూడండి

వీర్ దాస్‌తో కంగనా రనౌత్ కిస్సింగ్ సీన్.. పెదవులకు గాయం.. అసలు సంగతేంటి?

NTR: కార్తికేయ పౌరాణిక ఇతిహాసం కథతో ఎన్టీఆర్, త్రివిక్రమ్ చిత్రం

నా సిక్స్ ప్యాక్ ఇది.. మళ్లీ కలుద్దాం.. సమంత బేబీ బంప్ ఫోటో వైరల్

EVV satyanarayana: అల్లరి నరేష్ నటించిన ఆరుగురు పతివ్రతలు రీ-రిలీజ్ కాబోతోంది

తమిళనాట మరో జయమ్మగా త్రిష.. లారెన్స్ అలా చెప్పడంతో త్రిషకు డిప్యూటీ సీఎం పోస్ట్?

తర్వాతి కథనం
Show comments