Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్క్రీన్‌‌ను బద్దలు కొట్టుకొని సింహం బయటికి వస్తే..?

Written By సెల్వి
Updated: సోమవారం, 11 జనవరి 2021 (10:23 IST)
Lion
సాంకేతికత పరంగా ప్రపంచం దూసుకుపోతోంది. నమ్మలేని విషయాలను కళ్ల ముందుకు తెస్తోంది. అలాంటిదే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా చైనా, ఉత్తరకొరియా రోడ్లపై ఏర్పాటు చేసిన స్క్రీన్లను చూసి అక్కడి వారు నిత్యం ఆశ్చర్యపోతున్నారు.

చైనాలోని చెంగ్డూలో ఏర్పాటు చేసిన ఓ 3డీ డిస్​ప్లేను చూసిన మహిళ పరుగులు పెట్టింది. హఠాత్తుగా స్కీన్ లోపల ఉన్న సింహం బయటకు వచ్చినట్టు అనిపించింది. చూసేందుకు ఆ 3డీ వీడియో అలానే ఉంది. స్క్రీన్‌‌ను బద్దలు కొట్టుకొని సింహం బయటికి వచ్చినట్టు అనిపించడంతో ఆమె పరుగెత్తింది. ఈ వీడియో వైరల్​గా మారింది.
 
ఇక గువాన్​యిన్​క్వియాలో ఏర్పాటు చేసిన స్క్రీన్లలో ప్రదర్శించిన ఫ్లయింగ్ సాసర్​ 3డీ వీడియోలు సైతం అబ్బురపరుస్తున్నాయి. రైలు, విమానాలు ఇలా ఆ డిస్​ప్లేల్లో కనిపించే ప్రతి ఒక్కటి తమ మధ్యలోకి వస్తున్నాయేమో అన్నట్టు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా కళ్లకు ఎలాంటి ప్రత్యేకమైన అద్దాలు లేకుండా ఈ త్రీడీ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తుండడం ప్రత్యేకత. ఇలాగే 2020లో సౌత్ కొరియాలో ఏర్పాటు చేసిన ఓ 3డీ డిస్​ప్లే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. 
 

అన్నీ చూడండి

ఇండస్ట్రీలో త్రిష వంటి వ్యక్తులు చాలా అరుదు : మాళివికా మోహనన్

Screenplay Master' book: స్క్రీన్ ప్లే మాస్టర్ - సుకుమార్ పుస్తకం ఆవిష్కరణ

వైభవోపేతంగా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 10: తొలి అవతారంగా మహాపరీక్షను ప్రకటించిన నాగార్జున

Ranbali: విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా రణబాలి టీజర్ డేట్ ఫిక్స్

Priyadarshi : ప్రియదర్శి చిత్రం ఇడుపు కాయితం నుంచి శ్రీలత. సాంగ్ రాబోతోంది

తర్వాతి కథనం
Show comments