టిక్ టాక్ పిచ్చి.. వరద నీటితో ఓవరాక్షన్.. కొట్టుకుపోయాడు..

శనివారం, 27 జులై 2019 (11:59 IST)
టిక్ టాక్‌ పిచ్చి మాత్రం జనాల్లో ఏమాత్రం తగ్గలేదు. బీహార్‌‌లో వర్షం బీభత్సం కారణంగా వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద నీటిలో టిక్‌టాక్ చేయబోయి.. ఉద్ధృతికి కొట్టుకుపోయాడు ఓ యువకుడు. మూడు రోజుల క్రితం అద్దావ్‌పూర్‌కి చెందిన అఫ్జల్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి టిక్‌టాక్ చేసేందుకు వరద నీటి వద్దకు వెళ్లాడు.
 
తొలుత అప్జల్ స్నేహితుడు నీటిలో డైవ్ చేయగా, ఆ తరువాత అఫ్జల్ కూడా దూకాడు. అయితే, వరద ఉద్ధృతి కారణంగా అప్జల్ కొట్టుకుపోయాడు. వెంటనే అతడి స్నేహితుడు అధికారులకు సమాచారం ఇవ్వగా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చేపట్టింది. సహాయక సిబ్బంది అప్జల్ మృతదేహాన్ని కనుగొన్నారు.

అన్నీ చూడండి

ప్రతి హనీమూన్ స్విట్జర్లాండ్‌లోనే ఎందుకు ముగియాలి? కమల్ హాసన్

తమిళనాడు సీఎం విజయ్ కొడుకు జాసన్ విషయంలో అంత కఠినంగా ఎందుకో?

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే కొత్త పోస్టర్

Sureshbabu: నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, పంపిణీదారుల సమస్యలకు సబ్ కమిటీ ఏర్పాటు

Peddi : పెద్ది నుంచి శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫెరోషియస్ లుక్ రిలీజ్

తర్వాతి కథనం