ఆ మహిళ 15 యేళ్లుగా తెలుసు... తనకు చెల్లిలాంటిది : సిద్ధరామయ్య

సోమవారం, 28 జనవరి 2019 (20:25 IST)
మైసూరులో జరిగిన కాంగ్రెస్ సభలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఓ ముస్లిం మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఈ సభలో ముందు వరుసలో కూర్చొన్న ఆ మహిళ... ఏదో మాట్లాడబోతుంటే... ఆమెను ఆపే ప్రయత్నంలో భాగంగా, చేతిలోని మైక్ లాక్కున్నారు. అపుడు సిద్ధరామయ్య చేతి వేళ్ళకు తగులుకుని చున్నీ జారిపోయింది. 
 
అలాగే, ఆమె భుజాన్ని తాకి కింద కూర్పోబెట్టే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాంగ్రెస్ నేతలు మహిళను గౌరవించడం లేదనీ, వారిపట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. దీంతో సిద్ధరామయ్య వివరణ ఇచ్చారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, ఆ సభలో మహిళా కార్యకర్త ప్రసంగాన్ని ఆపే ప్రయత్నంలో మైక్ లాక్కున్నానని చెప్పారు. ఆ సంఘటన అనుకోకుండా జరిగిపోయిందని వివరించారు. 'ఆమె నాకు 15 ఏళ్లుగా తెలుసు. నాకు తను చెల్లెలి లాంటిది. నాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు' అని చెప్పారు.

అన్నీ చూడండి

Aishwarya Rajesh: హీరోయిన్ కి మూడేళ్ళ స్పాన్ అనే వారు. అదే నిజం అనుకున్నా : ఐశ్వర్య రాజేష్

జీ5 కిడ్స్ లో యానిమేటెడ్ పౌరాణిక సిరీస్ శివలోక్ కె కుండక్క మండక్క

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్, డైరెక్టర్ ప్రియదర్శన్. హైవాన్ లుక్

ప్రేమ, జ్ఞాపకాలతో తెరకెక్కిన సహ సినిమా చాలా నచ్చింది : కిరణ్ అబ్బవరం

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఆవిష్కరించిన ఫీల్ మై లవ్ ఫస్ట్ లుక్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments