లక్ష్మీ పార్వతిపై ఆ ఆరోపణలు చేసిన యువకుడికి భాజపా తీర్థం... పూనమ్ ఏమంటుందో?

మంగళవారం, 2 జులై 2019 (16:37 IST)
ఆమధ్య తనను వైసీపీ మహిళా నేత లక్ష్మీ పార్వతి లైంగికంగా వేధిస్తోందంటూ సోషల్ మీడియాలో కలకలం సృష్టించిన కోటి అనే యువకుడు వార్తల్లోకి ఎక్కిన సంగతి తెలిసిందే. ఐతే ఆ యువకుడు హఠాత్తుగా ఇప్పుడు ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో భాజపా తీర్థం పుచ్చుకున్నాడు. 
 
కొన్ని రోజుల క్రితం తనను వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి లైంగికంగా వేధిస్తోందంటూ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేసి వార్తల్లోకి ఎక్కాడు. కాగా అతడు తనపై దుష్ర్పచారం చేసి తన పరువుకి భంగం కలిగించాడంటూ లక్ష్మీపార్వతి తెలంగాణ డిజీపి ఫిర్యాదు చేశారు.

ఇతడిపై నటి పూనమ్ కౌర్ కూడా సైబర్ క్రైమ్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయడం గమనార్హం. వీరిరువురూ తమను కోటీ అనే వ్యక్తి వాట్సప్ మెసేజిలతో వేధిస్తున్నాడంటూ ఫిర్యాదు చేశారు. ఐతే.. అతడు ఇప్పుడు భాజపాలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

అన్నీ చూడండి

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం