'మా' గొడవ, ఎవరు కరెక్ట్? చిరంజీవి లేదా రాజశేఖర్?

Written By ఐవీఆర్
Updated: గురువారం, 2 జనవరి 2020 (21:12 IST)
కొన్ని మాటలు మంచికి బాట వేస్తాయి. మరికొన్ని మాటలు కొట్లాటలు సృష్టిస్తాయి. ఇంకొన్ని మాటలు యుద్ధాలకే దారి తీస్తాయి. ఐతే శుభమా అని 2020 జనవరి 1న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన సంవత్సరం సందర్భంగా కొత్త డైరీని విడుదల చేసే క్రమంలో నటుడు రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలు అతడి పదవికే ఎసరు పెట్టింది. ఐతే సభలో రాజశేఖర్ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవితో పాటు మరికొందరు నటీనటులు తీవ్రంగా ఖండించారు. 
 
'మా' సభ్యులు మంచిని బహిరంగంగా చెప్పుకోవాలనీ, చెడు వుంటే చెవిలో చెప్పుకోవాలని చిరంజీవి సూచన చేశారు. ఐతే ఈ సూచనపై రాజశేఖర్ విభేదించారు. బహిరంగంగా అందరి ముందూ మాట్లాడటంతో చిరంజీవితో పాటు మోహన్ బాబు కూడా అసహనానికి గురయ్యారు.

రాజశేఖర్ మాట్లాడిన తర్వాత చిరు మళ్లీ సర్దిచెప్పబోతున్న సమయంలో కూడా రాజశేఖర్ మళ్లీ కల్పించుకోవడంతో... ఇంతమంది పెద్దలు ఇక్కడ వుండగానే రాజశేఖర్ అలా మాట్లాడటం చూస్తుంటే ఇదంతా ముందస్తు ప్లాన్ అనీ, ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటూ మెగాస్టార్ చిరంజీవి డిమాండ్ చేశారు. 
 
వెంటనే కృష్ణంరాజు మైకు అందుకుని కో-ఆర్డినేషన్ కమిటీ వేస్తామనీ, ఏవయినా సమస్యలుంటే సభ్యులు అక్కడే మాట్లాడాలనీ, బయట మాట్లాడితే చర్యలు తప్పవని చెప్పారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే 'మా' ఉపాధ్యక్ష పదవికి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో చిరంజీవి చేసింది కరెక్టా లేదంటే రాజశేఖర్ చేసింది కరెక్టా అనే చర్చ నడుస్తోంది. మరి మీరు ఏమని అంటారు?

అన్నీ చూడండి

Rohit Nara : వినికిడి లోపం గల సౌండ్ ఇంజినీర్ గా రోహిత్ నారా టైటిల్ ప్రకటన

Surya and Mamitha Baiju : ది వెడ్డింగ్ సాంగ్ లో ఆడి పాడిన సూర్య, మమితా బైజు

NEET పేపర్ లీక్, అట్లాంటి పేరెంట్స్ వల్లనే, అది తప్పుడు పెంపకం: యాంకర్ రష్మి గౌతమ్

Raghavendra Pujari : సైకలాజికల్ థ్రిల్లర్‌.. లూసీ చిత్రం పూర్తి, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు

Vijay Antony :విజయ్ ఆంటోని తో ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో నాన్న కుట్టి చిత్రం

తర్వాతి కథనం
Show comments