Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ఐదో మంకీపాక్స్ కేసు నమోదు - దేశంలో 7కి చేరిన కేసులు

Written By ఠాగూర్
Updated: మంగళవారం, 2 ఆగస్టు 2022 (13:50 IST)
దేశంలో ఒకవైపు కరోనా వైరస్‌తో పాటు మరోవైపు మంకీపాక్స్ కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ పాజిటివ్ రోజువారీ నమోదు కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ మంకీపాక్స్ వైరస్ మాత్రం చాపకిందనీరులా వ్యాపిస్తుంది. ఫలితంగా మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేరళలో ఐదో మంకీపాక్స్ కేసు నమోదైంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య ఏడుగుకు చేరింది. 
 
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 27న కోజికోడ్ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. దీంతో ఆయన్ను మలప్పురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.
 
కాగా, మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తి త్రిశూర్‌లో ఈ నెల ఒకటో తేదీన ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. దీంతో అతనితో సంబంధాలు కలిగిన 20 మందిని అధికారులు ఐసోలేషన్‌కు తరలించారు. 

అన్నీ చూడండి

దర్శకుడు సాయి రాజేష్ ఆవిష్కరించిన డియర్ హార్ట్ మోషన్ పోస్టర్

రూ.200 కోట్ల క్లబ్‌లో రవితేజ 'ఇరుముడి' చిత్రం

ఆది సాయికుమార్ క్లాప్ తో ప్రారంభమైన ఇ.ఎం.ఐ. చిత్రం

ఇరుముడి లాంటి విజయం దశాబ్దానికి ఒకసారి వస్తుంది : నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్

Sumanth Prabhas :మన ఫ్యాన్ బాయ్ అనే ప్రేమ ప్రభాస్‌లో కనిపించింది : సుమంత్ ప్రభాస్

తర్వాతి కథనం
Show comments